ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ బాబా యోగేంద్ర జీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 10 JUN 2022 4:09PM by PIB Hyderabad

పద్మశ్రీ పురస్కార గ్రహీత మరియు ‘సంస్కార్ భారతి’ కి చెందిన ప్రముఖుడు శ్రీ బాబా యోగేంద్ర కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీ బాబా యోగేంద్ర మృతి ‘కళా జగతి కి తీరని లోటు’ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘దేశ సేవ కు అంకితమైన పద్మశ్రీ బాబా యోగేంద్ర జీ మరణించారన్న వార్త విని అత్యంత దుఃఖాని కి లోనయ్యాను. ఆయన నిష్క్రమణ యావత్తు కళా జగతి కే పూడ్చలేనటువంటి లోటు. ఆయన కు ఆ ఈశ్వరుడు తమ శ్రీ చరణాల లో స్థానాన్ని ప్రసాదించు గాక. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

DS

 



(Release ID: 1832981) Visitor Counter : 115