ప్రధాన మంత్రి కార్యాలయం

నేపాల్‌లోని లుంబినిలో బుద్ధజయంతి వేడుకలు

Posted On: 16 MAY 2022 4:21PM by PIB Hyderabad

   నేపాల్‌లోని లుంబినీలోగల అంతర్జాతీయ సమావేశ కేంద్రం-ధ్యాన మందిరంలో నిర్వహించిన 2566వ బుద్ధ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతోపాటు గౌరవనీయులైన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా, ఆయన సతీమణి డాక్టర్ అర్జు రానా దేవ్‌బా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   గౌరవనీయులైన నేపాల్ సాంస్కృతిక-పర్యాటకం, పౌర విమానయాన శాఖ మంత్రి, లుంబినీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఎల్‌డీటీ) చైర్మన్ శ్రీ ప్రేమ్ బహదూర్ అలే, గౌరవనీయులైన లుంబిని  ముఖ్యమంత్రి శ్రీ కుల్ ప్రసాద్ కెసి, ఎల్‌డీటీ వైస్-చైర్మన్, పూజనీయ మెట్టెయ్య శాక్య పుట్టా సహా నేపాల్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బౌద్ధ సన్యాసులు, పండితులు, అంతర్జాతీయ ప్రతినిధులు మొత్తం దాదాపు 2500 మందిని ఉద్దేశించి రెండు దేశాల ప్రధానమంత్రులు ప్రసంగించారు.



(Release ID: 1825902) Visitor Counter : 111