ప్రధాన మంత్రి కార్యాలయం

యుఎఇ అధ్యక్షుడు శ్రీ శేఖ్ ఖలీఫాబిన్ జాయద్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 13 MAY 2022 6:14PM by PIB Hyderabad

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ ఒక గొప్ప రాజనీతిజ్ఞ‌ుడు మరియు దూరదర్శి నేత అని ఆయన హయాము లో భారతదేశం- యుఎఇ సంబంధాలు సమృద్ధం అయ్యాయని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ కన్నుమూశారని తెలిసి నేను తీవ్ర దు:ఖం లో మునిగాను. ఆయన ఒక గొప్ప రాజనీతిజ్ఞ‌ుడు మరియు దూరదర్శి నేత; ఆయన మార్గదర్శకత్వం లో భారతదేశం - యుఎఇ సంబంధాలు సమృద్ధం అయ్యాయి. ఈ వేళ లో యుఎఇ ప్రజల కు ఇదే భారతదేశ ప్రజల హార్దిక సంతాపం. శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ ఆత్మ కు శాంతి ప్రాప్తించు గాక.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1825638) Visitor Counter : 116