ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు రేపు ముఖ్యమంత్రులతో సంభాషించనున్న - ప్రధానమంత్రి

Posted On: 26 APR 2022 8:43PM by PIB Hyderabad

కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రేపు ఏప్రిల్, 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించనున్నారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "కోవిడ్-19 పరిస్థితి ని సమీక్షించడానికి, రేపు, ఏప్రిల్, 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతాను." అని పేర్కొన్నారు.

 

*****

DS

 

 



(Release ID: 1820328) Visitor Counter : 100