వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకానికి గాను 2020 సంవత్సరానికి ప్రధాన మంత్రి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎక్సలెన్స్ అవార్డు ను అందుకున్న ఆహార, ప్రజా పంపిణీ శాఖ


దేశవ్యాప్తంగా పౌర-కేంద్రిత ప్రభుత్వ పథకాల వ్యాప్తిని మరింత విస్తృతం చేయడానికి ఒ.ఎన్.ఆర్.ఒ.సి డేటాబేస్ ను ఉపయోగించు కోవడానికి ఇతర మంత్రిత్వ శాఖలు,/ విభాగాలతో కలసి పని చేస్తున్న ఆహార, ప్రజా పంపిణీ శాఖ

Posted On: 22 APR 2022 4:52PM by PIB Hyderabad

తన ' ఒక దేశం- ఒకే రేషన్ కార్డు (వన్ నేషన్ - వన్ రేషన్ కార్డ్) ' (ఒ.ఎన్.ఆర్.ఒ.సి) పథకానికి గాను 2020 సంవత్సరానికి ఆహార, ప్రజా పంపిణీ శాఖ (డి ఎఫ్ పి డి) ప్రతిష్టాత్మక  ప్రధానమంత్రి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్  ఎక్సలెన్స్ అవార్డును అందుకుంది. 21.04.2022 న న్యూఢిల్లీ లో 15వ సివిల్ స ర్వీసుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ

 పరిపాలన లో ప్రతిభ కు గానూ ప్ర ధాన మంత్రి అవార్డులను గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రదానం చేశారు. ఇన్నోవేషన్ (జనరల్)-సెంట్రల్ కేటగిరీ కింద ఈ అవార్డును ప్రదానం చేశారు. ఒ ఎన్ ఒ ఆర్ సి మైలు రాయి ప్రణాళిక (ల్యాండ్‌మార్క్ ప్లాన్) అనేది దేశవ్యాప్త సృజనాత్మక ఆవిష్కరణ, ఇది

ఎన్ ఎఫ్ ఎస్ ఎ లబ్ధిదారులందరికీ, ముఖ్యంగా వలస లబ్ధిదారులకు, బయోమెట్రిక్/ఆధార్ ప్రమాణీకరణతో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డ్ ద్వారా దేశంలో ఎక్కడైనా,  ఏదైనా చౌక ధరల దుకాణం (ఎఫ్ పి ఎస్) నుండి పూర్తి లేదా పాక్షికంగా ఆహారధాన్యాలను తీసుకునేందుకు అనుమతిస్తుంది. ఈ వ్యవస్థ వారి కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చినట్లయితే, అదే రేషన్ కార్డుపై ఆహారధాన్యాల బ్యాలెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

 

దేశవ్యాప్తంగా పౌర-కేంద్రీకృత ప్రభుత్వ పథకాల విస్తరణ కోసం ఒ ఎన్ ఒ ఆర్ సి డేటాబేస్ భారీ పరిమాణాన్ని ప్రభావితం చేయడానికి.ఆహార,  ప్రజా పంపిణీ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలు/విభాగాలు అంటే నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ఎ), హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ (ఎం ఓ హెచ్ యు ఎ), కార్మిక -ఉపాధి మంత్రిత్వ శాఖ (ఎం ఓ ఎల్ ఇ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ (డి ఓ ఏ ఈ ఫ్ దబ్ల్యు) మొదలైన వాటితో కూడా సహకరిస్తోంది. 

 

ప్రారంభంలో నాలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 2019 లో ప్రారంభమయిన  ఒ ఎన్ ఒ ఆర్ సి డిసెంబర్ 2020 నాటికి 32 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు చాలా తక్కువ వ్యవధిలో విస్తరించింది. అప్పటి నుండి, క్రమంగా దశల వారీగా, ఒ ఎన్ ఒ ఆర్ సి  ప్లాన్ ప్రస్తుతం దేశంలోని దాదాపు 77 కోట్ల మంది లబ్ధిదారులను (దాదాపు 96.8% ఎన్ ఎఫ్ ఎస్ ఎ జనాభా) కవర్ చేస్తూ ఫిబ్రవరి 2022 నాటికి 35 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభించబడింది. అప్పటి నుండి, దశలవారీగా, ఒ.ఎన్.ఆర్.ఒ.సి ప్లాన్ ప్రస్తుతం 35 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ఫిబ్రవరి 2022 వరకు దేశంలో దాదాపు 77 కోట్ల మంది లబ్ధిదారులను (ఎన్ఎఫ్ఎస్ఎ జనాభాలో దాదాపు 96.8%) కవర్ చేస్తుంది.

 

కొవిడ్ -19 మహమ్మారి సమయంలో ఎన్ ఎఫ్ ఎస్ ఎ లబ్ధిదారులకు, ప్రత్యేకించి వలసదారులకు ఒ.ఎన్.ఆర్.ఒ.సి ఆహార రాయితీలను పోర్టబుల్ చేసింది, లాక్‌డౌన్ వ్యవధిలో దేశంలోని దాదాపు 5 లక్షల చౌక ధరల దుకాణాల్లో ఎక్కడైనా సులభంగా సబ్సిడీ ఆహార ధాన్యాల ప్రయోజనాన్ని పొందేందుకు వారిని అనుమతించింది.

ఆగష్టు 2019లో ఒ.ఎన్.ఆర్.ఒ.సి  ప్లాన్ ప్రారంభించినప్పటి నుండి, రాష్ట్రాలు/ కేంద్ర పాలిత  ప్రాంతాలలో ఇప్పటివరకు 65 కోట్లకు పైగా పోర్టబిలిటీ లావాదేవీలు నమోదు అయ్యాయి. రూ. 36,000 కోట్లు ఆహార సబ్సిడీ తో ముడిపడిన దాదాపు 121 ఎల్ ఎం టి ఆహారధాన్యాలను ఇంటర్-స్టేట్ ,ఇంట్రా-స్టేట్ పోర్టబిలిటీ లావాదేవీల అందచేసింది.

.ఎన్.ఆర్.ఒ.సి  కింద రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం నమోదు అవుతున్న నెలవారీ సగటు 2.7 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు (సాధారణ ఎన్ ఎఫ్ ఎస్ ఎ, పి ఎం -. జి కే ఏ వై ఆహారధాన్యాల లావాదేవీలతో సహా) ఇందుకు కీలక సంకేతం.

కోవిడ్-19 కాలంలో (ఏప్రిల్ 2020 నుండి ఇప్పటి వరకు) లబ్ధిదారులు అత్యధికం గా దాదాపు 58 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు జరిపారు.

 

.ఎన్.ఆర్.ఒ.సి ప్రత్యేక  కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ లో కూడా 13 భాషల్లో లభ్యం అవుతుంది . దాదాపు 20 లక్షల సార్లు డౌన్ లోడ్ అయింది. అంతేకాకుండా, వలస,  ఎన్ఎఫ్ఎస్ఎ లబ్ధిదారుల కోసం 5-అంకెల '14445' టోల్ ఫ్రీ నంబర్ కూడా ఒ.ఎన్.ఆర్.ఒ.సి కింద చాలా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంది.

 

****



(Release ID: 1819143) Visitor Counter : 158