ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులోగల రసాయన కర్మాగారం దుర్ఘటనలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
14 APR 2022 1:08PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులోగల రసాయన కర్మాగారంలో ప్రమాదంతో ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో-
“ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులోగల రసాయన కర్మాగారంలో ప్రమాదం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోవడం నన్నెంతో బాధించింది. ఈ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1816963)
आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam