ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులోగల రసాయన కర్మాగారం దుర్ఘటనలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 14 APR 2022 1:08PM by PIB Hyderabad

   ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులోగల రసాయన కర్మాగారంలో ప్రమాదంతో ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో-

 “ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులోగల రసాయన కర్మాగారంలో ప్రమాదం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోవడం నన్నెంతో బాధించింది. ఈ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1816963) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam