రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
భారత భూభాగంలోకి ప్రవేశించేటప్పుడు లేదా తిరిగి వెళ్లేటప్పుడు ఇతర దేశాలలో నమోదైన రవాణేతర (వ్యక్తిగత) వాహనాల కదలికలను అధికారికంగా ధ్రువీకరించుకొనేలా ముసాయిదా నోటిఫికేషన్ జారీ
Posted On:
17 MAR 2022 11:01AM by PIB Hyderabad
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అంతర్-దేశీయ రవాణాయేతర (వ్యక్తిగత) వాహన నియమాలను తాజాగా జారీ చేసింది. 2022 తేదీ 16.03.2022న దీనిని జారీ చేశారు. దీని ప్రకారం ఇతర దేశాలలో నమోదైన నాన్-ట్రాన్స్పోర్ట్ (వ్యక్తిగత) వాహనాలు భారత భూభాగంలోకి ప్రవేశించేటప్పుడు, లేదా తిరిగి వెళ్లేటప్పుడు కదలికను అధికారికంగా నమోదు చేసి ధ్రువీకరించుకొనేందుకు వీలుగా ఈ నియమాలు ప్రతిపాదించబడ్డాయి. దేశంలో ఉండే వ్యవధిలో అంతర్-దేశ నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలు నిబంధనల ప్రకారం ప్రయాణ సమయంలో వాహనం(ల)లో కింది పత్రాలను విధిగా తీసుకుపోవాల్సి ఉంటుంది. అవి:–
(i) చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
(ii) చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి, ఏది వర్తిసస్తే అది.
(iii) చెల్లుబాటు అయ్యే బీమా పాలసీ;
(iv )కాలుష్యం నియంత్రణ పత్రం (వాహనం నమోదు కాబడిన దేశంలో జారీ చేయడబడినది);
ఒకవేళ పైన సూచించిన పత్రాలు ఆంగ్లం కాకుండా వేరే భాషలో ఉన్నట్లయితే, జారీ చేసే అధికారం ఉన్న వారి ద్వారా అధికారికంగా ధ్రువీకరించబడిన అధీకృత ఆంగ్ల అనువాదమైన అసలు పత్రాలతో పాటు తీసుకురావాల్సి ఉంటుంది. భారతదేశం కాకుండా మరే దేశంలోనూ నమోదు చేయబడిన మోటారు వాహనాలు భారత భూభాగంలో స్థానిక ప్రయాణీకులను మరియు వస్తువులను రవాణా చేయడానికి అనుమతించబడవు. భారతదేశం కాకుండా మరే దేశంలోనైనా నమోదు చేయబడిన మోటారు వాహనాలు భారత దేశంలోని మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 118 ప్రకారం రూపొందించబడిన నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలి.
గెజిట్ నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
***
(Release ID: 1807071)