ప్రధాన మంత్రి కార్యాలయం
మాస్కో ‘ఉషు స్టార్స్ చాంపియన్ షిప్’లో స్వర్ణ పతక విజేత సాదియా తారిఖ్కు ప్రధానమంత్రి అభినందన
Posted On:
26 FEB 2022 9:02PM by PIB Hyderabad
మాస్కోలో నిర్వహిస్తున్న ‘ఉషు స్టార్స్ చాంపియన్ షిప్’ పోటీల్లో భారత క్రీడాకారిణి సాదియా తారిఖ్ స్వర్ణ పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను అభినందించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో-
“మాస్కో ‘ఉషు స్టార్స్ చాంపియన్ షిప్’లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సాదియా తారిఖ్కు అభినందనలు. ఆమె సాధించిన ఈ విజయం వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆమెకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1801623)
Visitor Counter : 180
Read this release in:
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam