యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఫిట్ ఇండియా క్విజ్ పోటీల్లో పాల్గొంటున్న అట్లెట్లను ప్రోత్సహించిన శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
08 FEB 2022 2:40PM by PIB Hyderabad
ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం అవుతున్న ఫిట్ ఇండియా క్విజ్ పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా క్విజ్ పోటీలలో దేశం లోని 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని 189 జిల్లాలకు చెందిన 360 పాఠశాలలు పాల్గొంటున్నాయి.
ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండు సంవత్సరాల కిందట సూచించారని శ్రీ అనురాగ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని తొలిసారిగా ఫిట్ ఇండియా క్విజ్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇండియా స్కూల్ ఫిట్నెస్ , స్పోర్ట్స్ క్విజ్ పేరిట వీటిని నిర్వహిస్తున్నామని అన్నారు. పోటీలలో పాల్గొంటున్న విద్యార్థులను మంత్రి అభినందించారు.

ప్రాధమిక రౌండ్ లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని అన్నారు. పోటీలో విజయం విజయం సాధించి తమ పాఠశాల, జిల్లా, రాష్ట్రానికి గుర్తింపు గౌరవం తేవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
రాష్ట్ర స్థాయి పోటీలు వెబ్ ఆధారిత పోటీలుగా జరుగుతాయి. ఒకో రౌండ్ లో 8 నుంచి 32 బృందాలు పోటీ పడతాయి. విజేతలు రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలుస్తారు. ఈ పోటీలను యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ, ఫిట్ ఇండియా సోషల్ మీడియాలో వెబ్ కాస్ట్ అవుతుంది. పోటీల్లో 3.25 కోట్ల రూపాయల నగదు బహుమతి అందించడం జరుగుతుంది. దీనిని క్విజ్ వివిధ స్థాయిల్లో విజేతలుగా నిలిచే పాఠశాలలు, విద్యార్థులకు అందిస్తారు.
శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ తో పాటు అనేకమంది క్రీడాకారులు క్విజ్ లో పాల్గొంటున్న విద్యార్థులను అభినందించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. టోక్యో ఒలింపిక్స్ లో వెండి పతకం సాధించిన మీరాబాయి చాను క్విజ్ లో పాల్గొంటున్న వారిని అభినందించారు. విద్యార్థులు ప్రతిభ కనబరిచి తొలిసారిగా నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా క్విజ్ పోటీలను విజయవంతం చేయాలని టోక్యో పారాలింపిక్స్ పతక విజేత శరద్ కుమార్ అన్నారు. పోటీల్లో పాల్గొంటున్న వారిలో ప్రతిభ కనబరిచిన వారు విజేతలుగా నిలుస్తారని, ప్రతి ఒక్కరూ విజయం సాధించేందుకు కృషి చేయాలని టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు మాణిక బాత్రా అన్నారు.
క్విజ్ ప్రాథమిక పోటీలలో 13,502 పాఠశాలలకు చెందిన 36,299 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలబాలికలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రాథమిక పోటీలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. గ్రేటర్ నోయిడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి దివ్యాన్షు ఛమోలీ మొదటి స్థానాన్ని, వారణాసి సన్ బీమ్ పాఠశాల విద్యార్థి శశ్వత్ మిశ్రా ద్వితీయ స్థానాన్ని సాధించారు. మూడవ స్థానంలో కర్ణాటక బెంగుళూరు బాల్డ్విన్ బాలికల పాఠశాల విద్యార్థి అర్కమిత్ర నిలిచారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన 36 పాఠశాల బృందాలు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తాయి. వీటిని ఈ ఏడాదిలో నిర్వహించడం జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఇతర సామాజిక మాధ్యమాలలో ఈ పోటీలు ప్రసారం అవుతాయి.
***
(Release ID: 1796525)