ప్రధాన మంత్రి కార్యాలయం

ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 01 JAN 2022 12:07PM by PIB Hyderabad

   ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-

“ఆనంద ఆంగ్ల సంవత్సరాది 2022!...

ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాన్నీ ఆయురారోగ్య ఐశ్వర్య సమృద్ధితో వర్ధిల్లజేయాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రగతి, సౌభాగ్యాలలో మనం సరికొత్త ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ దిశగా మహనీయులైన మన స్వాతంత్ర్య సమర యోధుల కలలను సాకారం చేయడానికి మరింత శ్రమిస్తామని ప్రతినబూనుదాం” అని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

 

***

DS/SH



(Release ID: 1786804) Visitor Counter : 173