ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి నేపథ్యంలో ప్రధాని సంస్మరణ

Posted On: 25 DEC 2021 9:37AM by PIB Hyderabad

   దేశ పూర్వ ప్రధాని శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-

“మాననీయులైన అటల్‌ జీ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళి. అటల్‌ జీని ఆయన జయంతి నేపథ్యంలో సంస్మరిస్తున్నాను. ఆయన జాతికి చేసిన అవిరళ సేవ మనకెంతో స్ఫూర్తిదాయకం. భారత్‌ను ప్రగతిశీల, సుదృఢ దేశంగా తీర్చిదిద్దడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది భారతీయుల జీవితాలను ప్రభావితం చేశాయి” అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1785149) Visitor Counter : 129