ప్రధాన మంత్రి కార్యాలయం

వారాణసీ లో శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

‘‘విశ్వనాథ్ధామ్ ఒక భవ్యమైన భవనం ఒక్కటే కాదు; ఇది భారతదేశం సనాతన సంస్కృతి కిఒక ప్రతీక.  ఇది మన ఆధ్యాత్మిక ఆత్మ తాలూకు ఒక సంకేతం గా ఉన్నది.  ఇది భారతదేశం ప్రాచీనత్వం, భారతదేశం సంప్రదాయాలు, భారతదేశం యొక్క శక్తి మరియుగతిశీలత ల సంకేతం గా ఉన్నది’’

‘‘ఇదివరకుఆలయ ప్రాంతం 3000 చదరపు అడుగులు గానే ఉండేది, దానిని ఇప్పుడు సుమారు 5 లక్షల చదరపు అడుగుల కు పెంచడంజరిగింది.  ఇక 50,000 నుంచి 75,000 మంది భక్తులు ఈ ఆలయాన్ని, ఆలయ పరిసరాల ను సందర్శించడానికివీలవుతుంది’’

‘‘కాశీవిశ్వనాథ్ ధామ్ ను అంకితం చేయడం భారతదేశాని కి ఒక నిర్ణయాత్మకమైనటువంటి దిశ ను ఇవ్వగలదు;మరి అది ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు కు బాట ను పరుస్తుంది.  ఈ భవన సముదాయం మన సామర్ధ్యానికి, మనకర్తవ్యాని కి ఒక సాక్షి గా ఉంది. దృఢ సంకల్పం తో, ఉమ్మడి ఆలోచనల తో ఏదీ అసాధ్యంకాదు.’’

‘‘నా వరకునాకు దైవం అంటే ప్రజల రూపం లో ఉంటారు, నా దృష్టి లో ప్రతి వ్యక్తీ దైవంతాలూకు ఒక భాగం గా కనిపిస్తారు.  దేశ ప్రజల ను నేను మూడు సంకల్పాలు తీసుకోవలసింది గా కోరుతాను.  అవి ఏవేవి అంటే - స్వచ్ఛత, సృజన లతో పాటు స్వయంసమృద్ధియుత భారతదేశం కోసంనిరంతర ప్రయాసలు- అనేవే’’

‘‘బానిసత్వంతాలూకు దీర్ఘ కాలం మన ఆత్మవిశ్వాసాన్ని ఎంతలాదెబ్బతీసింది అంటే మనం మన స్వీయ సృజన పట్ల నమ్మకాన్ని కోల్పోయేటంత గా అన్నమాట.  ఈ రోజు న, ఈ వేయి సంవత్సరాల పాతదిఅయినటువంటి కాశీ నుంచి నేను దేశం లో ప్రతి ఒక్కరికి ఏమని పిలుపు ను ఇస్తున్నానుఅంటే  అది– పూర్తి విశ్వాసం తో సృజన నుచేయండి, కొత్తవిషయాలు ఆవిష్కరించండి, ఆ పని ని కొత్తదైన మార్గం లో చేయండి- అనేదే ’’

కాశీ విశ్వనాథ్ ధామ్ నిర్మాణంలో పాలుపంచుకొన్న శ్రమికుల ను సమ్మానించడం తో పాటు వారితో కలసి మధ్యాహ్న భోజనాన్నిస్వీకరించారు

Posted On: 13 DEC 2021 3:16PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారాణసీ లో ఈ రోజు న శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభించారు.  ఆయన కాశీ లో కాలభైరవ ఆలయం లో, కాశీ విశ్వనాథ్ ధామ్ లో జరిగిన ప్రార్థనల లో పాలుపంచుకొన్నారు.  ఆయన గంగా నది లో పవిత్ర స్నానాన్ని కూడా ఆచరించారు.

 

‘నగర కొత్వాల్’ (భగవాన్ కాల భైరవుని) చరణాల కు ప్రణామం అని పలుకుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.  ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకోనిదే ప్రత్యేకమైన ఘటన ఏదీ జరుగదు అని ప్రధాన మంత్రి అన్నారు.  దేశ ప్రజల కు ఆ భగవానుని ఆశీస్సు లు ప్రాప్తించాలి అని ప్రధాన మంత్రి కోరుకొన్నారు.  ఎవరైనా కాశీ లోకి ప్రవేశించిన వెంటనే, ఆ వ్యక్తి అన్ని బంధనాల నుంచి విముక్తం అవుతారు అని పురాణాలు చెప్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  ‘‘భగవాన్ విశ్వేశ్వరుని ఆశీర్వాదాల తో మన అంతరాత్మ లో ఒక మహా శక్తి జాగృతం అవుతుంది’’ అని ఆయన చెప్పారు.  విశ్వనాథ్ ధామ్ లోని ఈ యావత్తు నూతన భవన సముదాయం కేవలం ఒక భవ్యమైన నిర్మాణం కాదు; అది మన భారతదేశం సనాతన సంస్కృతి కి ఒక చిహ్నం గా ఉన్నది.  అది మన ఆధ్యాత్మిక ఆత్మ యొక్క సంకేతం గా ఉన్నది.  అది భారతదేశం యొక్క ప్రాచీతన్వం, భారతదేశం యొక్క సంప్రదాయాలు, భారతదేశం యొక్క శక్తి, ఇంకా భారతదేశం యొక్క గతిశీలత ల ప్రతీక గా ఉన్నది అని ఆయన అన్నారు.  ‘ఎవరైనా ఇక్కడి కి వస్తే, వారు ఒక్క విశ్వాసాన్ని మాత్రమే చూడరు. వారు ఇక్కడి గత వైభవాన్ని కూడా అనుభూతి చెందుతారు.  ప్రాచీనత్వం మరియు ఆధునికత్వం ఏ విధం గా కలసికట్టుగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నదీ గమనిస్తారు.  ప్రాచీనత్వం తాలూకు ప్రేరణ లు భవిష్యత్తు కు ఏ విధం గా దిశ ను ఇస్తున్నదీ చూస్తారు.  మనం ఈ విషయాల ను ఎంతో స్పష్టం గా విశ్వనాథ్ ధామ్ పరిసరాల లో  దర్శిస్తున్నాం’ అని ఆయన అన్నారు.

ఇదివరకు ఆలయ ప్రాంతం 3000 చదరపు అడుగు లు గా మాత్రమే ఉండగా, దాని ని ప్రస్తుతం రమారమి 5 లక్షల చదరపు అడుగు ల మేరకు విస్తరించడమైంది అని ప్రధాన మంత్రి తెలిపారు.  ప్రస్తుతం 50,000 నుంచి 75,000 వేల దాకా భక్త జనులు ఆలయాన్ని, ఆలయ పరిసరాల ను సందర్శించవచ్చును.  అంటే, ఇక మీదట ముందు గా గంగ మాత ను దర్శనం చేసుకొని, గంగ (నది) లో స్నానాన్ని ఆచరించడమూ, మరి అక్కడి నుంచి నేరు గా విశ్వనాథ్ ధామ్ కు చేరుకోవడమూ ను అన్నమాటే అంటూ ఆయన వివరించారు.

కాశీ యొక్క వైభవాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, నాశనం లేనిది కాశీ, భగవాన్ శివుని సంరక్షణ లో ఉంది కాశీ అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ భవ్య పరిసరాల నిర్మాణం లో పాలుపంచుకొన్న  శ్రమికులు అందరి కీ ఆయన తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.  వారు కరోనా సైతం ఇక్కడ జరుగుతున్న పనుల ను అడ్డుకోనీయలేదు అని ఆయన పేర్కొన్నారు.  వారితో ఆయన భేటీ అయ్యి, వారి కి అభినందించారు.  ధామ్ నిర్మాణం కోసం పాటుపడ్డ శ్రమికుల తో శ్రీ నరేంద్ర మోదీ కలసి మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు.  చేతి వృత్తి పనివారి ని నిర్మాణం తో అనుబంధం కలిగిన వ్యక్తుల ను, పాలన యంత్రాంగాన్ని, కాశీ లో ఇళ్లు ఉన్న కుటుంబాల ను  ప్రధాన మంత్రి ప్రశంసించారు.  దీనితో పాటు గాకాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు ను పూర్తి చేయడం కోసం అదే పని గా కఠోర శ్రమ ను చేసిన ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాని కి, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కు కూడా ఆయన అభినందనల ను తెలియజేశారు.

ముట్టడిదారులు ఈ నగరం పైకి దండెత్తి వచ్చారు, దీనిని ధ్వంసం చేయాలని చూశారు అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ నగరం ఔరంగజేబ్ భయంకర కార్యాల చరిత్ర కు మరియు అతడి దురాగతాల కు సాక్షి గా ఉంది అని ఆయన అన్నారు.  ఖడ్గం ద్వారా నాగరకత ను మార్చాలని యత్నించింది ఎవరు?  మతమౌఢ్యం తో సంస్కృతి ని కాలరాసే ప్రయత్నాన్ని చేసింది ఎవరు?  కానీ, ఈ దేశం లోని మట్టి మిగతా ప్రపంచాని కంటే భిన్నమైంది గా ఉంది.  ఔరంగజేబ్  అంటూ ఒకడుంటే, అప్పుడు శివాజీ కూడా ఉంటాడు అని ప్రధాన మంత్రి అన్నారు.  ఎవరైనా సాలార్ మసూద్ ఇటువైపు వచ్చాడు అంటే గనక అప్పుడు భారతదేశం ఏకత తాలూకు శక్తి ని అతడు చవి చూసేటట్టు రాజా సుహేల్ దేవ్ వంటి వీర యోధుడు చేస్తారు.  మరి బ్రిటిషు హయాం లో సైతం, హేస్టింగ్స్ కు కాశీ నివాసులు ఏ గతి ని పట్టించారూ అనేది కాశీ ప్రజలకు తెలిసిందే కదా అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర  మోదీ అన్నారు.

 

కాశీ యొక్క మహిమ ను, కాశీ యొక్క ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో మరింత గా వర్ణించారు.  కాశీ ని కొన్ని మాటల తో చెప్పలేం, అది సంచలనాల కు నిలయం అని ఆయన వ్యాఖ్యానించారు.  కాశీ ఏది అంటే- ఎక్కడయితే జాగృతి జీవం పోసుకొంటుందో అది; కాశీ ఏది అంటే- ఎక్కడయితే మృత్యువు సైతం మంగళకరమో అటువంటిది, కాశీ ఏది అంటే- ఎక్కడయితే సత్యమే సంస్కారం గా ఉన్నదో అది;  కాశీ ఏది అంటే - ఎక్కడ ప్రేమ అనేది సంప్రదాయం గా ఉన్న ప్రాంతమో అది అని ఆయన చెప్పారు.  వారాణసీ ఎటువంటి నగరం అంటే ఎక్కడినుంచయితే జగద్గురు శంకరాచార్య కు శ్రీ డోమ్ రాజా యొక్క పవిత్రత నుంచి ప్రేరణ లభించిందో అది, మరి ఆయన దేశాన్ని ఏకత తాలూకు సూత్రం తో కలపాలని సంకల్పించుకొన్నారు.  ఇది ఎటువంటి స్థానం అంటే ఎక్కడయితే భగవాన్ శంకరుని నుంచి గోస్వామి తులసీదాస్ ప్రేరణ ను పొంది రామ్ చరిత్ మానస్ వంటి అలౌకిక రచన ను చేశారో అది అని ప్రధాన మంత్రి అన్నారు.  ఇక్కడి సారనాథ్ లో భగవాన్ బుద్ధుని జ్ఞానబోధ  ప్రపంచానికి వెల్లడి అయింది అని ప్రధాన మంత్రి అన్నారు.  సంఘాన్ని సంస్కరించడం కోసమని కబీర్ దాస్ వంటి మనీషి ఇక్కడ అవతరించారు ఒకవేళ సమాజాన్ని జోడించవలసినటువంటి అవసరమే ఏర్పడింది అంటే అప్పుడు ఈ కాశీ సంత్ రై దాస్ జీ యొక్క భక్తి తాలూకు శక్తి కి కేంద్రం గా మారింది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

కాశీ అనేది అహింస, ఇంకా నిష్ఠ ల సారం అయినటువంటి నలుగురు జైన తీర్థంకరుల గడ్డ గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.  రాజు హరిశ్చంద్రుని సత్య నిష్ఠ మొదలుకొని వల్లభాచార్య, రమానంద్ జీ ల జ్ఞానం వరకు; చైతన్య మహాప్రభు, సమర్థ్ గురు రామ్ దాస్ ల నుంచి స్వామి వివేకానంద, మదన్ మోహన్ మాలవీయ వరకు; కాశీ అనే పవిత్ర భూమి అనేక మంది మునుల కు, ఆచార్యుల కు నివాసం గా ఉండింది అని ఆయన చెప్పారు.  ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ కు విచ్చేశారు; రాణి లక్ష్మీ బాయి మొదలుకొని చంద్రశేఖర్ ఆజాద్ వరకు, ఎందరో సేనానుల కు కర్మ భూమి గా, జన్మభూమి గా కాశీ  నిలచింది.  భారతేందు హరిశ్ఛంద్ర, జయ్ శంకర్ ప్రసాద్, ముంశీ ప్రేమ్ చంద్, పండిత్ రవి శంకర్, ఇంకా బిస్మిల్లాహ్ ఖాన్ ల వంటి ప్రతిభావంతులు ఈ గొప్ప నగరం నుండే వచ్చారు అని ఆయన అన్నారు.

 

కాశీ విశ్వనాథ్ ధామ్ ను దేశ ప్రజల కు అంకితం చేయడం అనేది భారతదేశాని కి ఒక నిర్ణయాత్మకమైన దిశ ను ఇస్తుంది; మరి అది ఒక ఉజ్వల భవిష్యత్తు కు బాట ను పరుస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పరిసరాలు మన సామర్థ్యాని కి, మన కర్తవ్యాని కి సాక్షి గా ఉన్నాయి. దృఢ సంకల్పం తీసుకొని, ఉమ్మడి గా ఆలోచన చేసినట్లయితే సాధించలేనిది అంటూ ఏదీ లేదు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఊహించలేని దాని ని సాకారం చేసే శక్తి భారతదేశ వాసుల కు ఉన్నది. తపస్వులను గురించి మనం ఎరుగుదుం, మనకు తపస్సు చేయడం ఎలాగన్నది తెలుసును; మరి మనం దేశం కోసం పగటి ని, రాత్రి ని ఎలాగ వెచ్చించాలో కూడా తెలిసిన వారం. సవాలు ఎంత పెద్దది అయినా కావచ్చు గాక, మన భారతీయులం అందరమూ కలిసికట్టుగా ఉండి దానిని ఓడించగలం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

వర్తమాన భారతదేశం తాను కోల్పోయినటువంటి వారసత్వాన్ని పునరుద్ధరించుకొంటున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక్కడ కాశీ లో మాత అన్నపూర్ణ దేవి స్వయం గా తాను విరాజిల్లుతూ ఉన్నారు అని ఆయన అన్నారు. కాశీ నుంచి దొంగతనానికి గురి అయినటువంటి మాత అన్నపూర్ణ యొక్క విగ్రహాన్ని ఒక శతాబ్ద కాలం ఎదురుచూపుల తరువాత ప్రస్తుతం కాశీ లో తిరిగి ప్రతిష్ఠించడం జరిగినందుకు ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

 

ప్రజల రూపం లో దైవం దిగివచ్చినట్లు తన కు తోస్తున్నదని, మరి తన కు భారతదేశం లో ప్రతి ఒక్కరు దైవం లో ఒక భాగం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల వద్ద నుంచి మూడు సంకల్పాల ను ఆయన కోరుకొన్నారు. అవి ఏవేవి అంటే.. ఒకటోది స్వచ్ఛత, రెండోది సృజన, ఇక మూడోది స్వయంసమృద్ధియుతమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం నిరంతరంగా ప్రయాస లు చేస్తూ ఉండటం.. అనేటటువంటి అంశాలు.

 

స్వచ్ఛతఅనేది ఒక మనుగడ తాలూకు ఒక మార్గం అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఈ కార్యం లో, ప్రత్యేకించి నమామి గంగే అభియాన్ లో, ప్రజలు అందరూ పాలుపంచుకోవాలి అంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. దీర్ఘ కాలం పాటు బానిసతనం లో మగ్గడం మన ఆత్మవిశ్వాసాన్ని ఎంతగా దెబ్బతీసింది అంటే మనం మన స్వీయ సృజన పట్ల నమ్మకాన్నే కోల్పాయేటంత గా అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న, ఈ వేయి సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ కాశీ నుంచి నేను దేశం లోని ప్రతి ఒక్కరి కి పిలుపు ను ఇస్తున్నాను; అది ఏమిటి అంటే- పూర్తి విశ్వాసం తో సృజన ను చేయమని,. కొత్త కొత్త విషయాల ను కనుగొనండని, అది కూడా ను కొత్తదైన మార్గం లో ఆ పని ని పూర్తి చేయండి- అనేదే అని ఆయన అన్నారు.

 

ఇక ఈ రోజు న మూడో సంకల్పం తీసుకోవలసిన అవసరం కూడా ఉన్నది; అది ఏమిటి అంటే- ఆత్మనిర్భర్ భారత్ ను ఆవిష్కరిండం కోసం మన ప్రయాసల ను పెంచడం అనేదే- అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  స్వాతంత్య్రం తాలూకు 75 వ సంవత్సరం అయినటువంటి ఈ ‘అమృత కాలం’లో ఎప్పుడైతే భారతదేశం స్వాతంత్య్రం తాలూకు ఒక వంద సంవత్సరాల ను ఉత్సవం గా జరుపుకొంటుందో అప్పటికంతా భారతదేశం ఎలా ఉంటుందన్న దాని కోసం మనం కృషి చేసితీరాలి అని పేర్కొంటూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

अभी मैं बाबा के साथ साथ नगर कोतवाल कालभैरव जी के दर्शन करके भी आ रहा हूँ, देशवासियों के लिए उनका आशीर्वाद लेकर आ रहा हूँ।

काशी में कुछ भी खास हो, कुछ भी नया हो, उनसे पूछना आवश्यक है।

मैं काशी के कोतवाल के चरणों में भी प्रणाम करता हूँ: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

हमारे पुराणों में कहा गया है कि जैसे ही कोई काशी में प्रवेश करता है, सारे बंधनों से मुक्त हो जाता है।

भगवान विश्वेश्वर का आशीर्वाद, एक अलौकिक ऊर्जा यहाँ आते ही हमारी अंतर-आत्मा को जागृत कर देती है: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

विश्वनाथ धाम का ये पूरा नया परिसर एक भव्य भवन भर नहीं है,
ये प्रतीक है, हमारे भारत की सनातन संस्कृति का!

ये प्रतीक है, हमारी आध्यात्मिक आत्मा का!

ये प्रतीक है, भारत की प्राचीनता का, परम्पराओं का!

भारत की ऊर्जा का, गतिशीलता का: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

आप यहाँ जब आएंगे तो केवल आस्था के दर्शन नहीं करेंगे।

आपको यहाँ अपने अतीत के गौरव का अहसास भी होगा।

कैसे प्राचीनता और नवीनता एक साथ सजीव हो रही हैं,

कैसे पुरातन की प्रेरणाएं भविष्य को दिशा दे रही हैं,

इसके साक्षात दर्शन विश्वनाथ धाम परिसर में हम कर रहे हैं: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

पहले यहाँ जो मंदिर क्षेत्र केवल तीन हजार वर्ग फीट में था, वो अब करीब 5 लाख वर्ग फीट का हो गया है।

अब मंदिर और मंदिर परिसर में 50 से 75 हजार श्रद्धालु आ सकते हैं।

यानि पहले माँ गंगा का दर्शन-स्नान, और वहाँ से सीधे विश्वनाथ धाम: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

काशी तो काशी है! काशी तो अविनाशी है।

काशी में एक ही सरकार है, जिनके हाथों में डमरू है, उनकी सरकार है।

जहां गंगा अपनी धारा बदलकर बहती हों, उस काशी को भला कौन रोक सकता है? - PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

मैं आज अपने हर उस श्रमिक भाई-बहन का भी आभार व्यक्त करना चाहता हूं जिसका पसीना इस भव्य परिसर के निर्माण में बहा है।

कोरोना के विपरीत काल में भी, उन्होंने यहां पर काम रुकने नहीं दिया।

मुझे अभी अपने इन श्रमिक साथियों से मिलने का, उनका आशीर्वाद लेने का सौभाग्य मिला है: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

हमारे कारीगर, हमारे सिविल इंजीनयरिंग से जुड़े लोग, प्रशासन के लोग, वो परिवार जिनके यहां घर थे सभी का मैं अभिनंदन करता हूं।

इन सबके साथ यूपी सरकार, मुख्यमंत्री योगी आदित्यनाथ जी का भी अभिनंदन करता हूं जिन्होंने काशी विश्वनाथ धाम परियोजना को पूरा करने के लिए दिन-रात एक कर दिया: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

आतातायियों ने इस नगरी पर आक्रमण किए, इसे ध्वस्त करने के प्रयास किए!

औरंगजेब के अत्याचार, उसके आतंक का इतिहास साक्षी है।

जिसने सभ्यता को तलवार के बल पर बदलने की कोशिश की,

जिसने संस्कृति को कट्टरता से कुचलने की कोशिश की!

लेकिन इस देश की मिट्टी बाकी दुनिया से कुछ अलग है: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

यहाँ अगर औरंगजेब आता है तो शिवाजी भी उठ खड़े होते हैं!

अगर कोई सालार मसूद इधर बढ़ता है तो राजा सुहेलदेव जैसे वीर योद्धा उसे हमारी एकता की ताकत का अहसास करा देते हैं।

और अंग्रेजों के दौर में भी, हेस्टिंग का क्या हश्र काशी के लोगों ने किया था, ये तो काशी के लोग जानते ही हैं: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

काशी शब्दों का विषय नहीं है, संवेदनाओं की सृष्टि है।

काशी वो है- जहां जागृति ही जीवन है!

काशी वो है- जहां मृत्यु भी मंगल है!

काशी वो है- जहां सत्य ही संस्कार है!

काशी वो है- जहां प्रेम ही परंपरा है: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

बनारस वो नगर है जहां से जगद्गुरू शंकराचार्य को श्रीडोम राजा की पवित्रता से प्रेरणा मिली, उन्होंने देश को एकता के सूत्र में बांधने का संकल्प लिया।

ये वो जगह है जहां भगवान शंकर की प्रेरणा से गोस्वामी तुलसीदास जी ने रामचरित मानस जैसी अलौकिक रचना की: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

यहीं की धरती सारनाथ में भगवान बुद्ध का बोध संसार के लिए प्रकट हुआ।

समाजसुधार के लिए कबीरदास जैसे मनीषी यहाँ प्रकट हुये।

समाज को जोड़ने की जरूरत थी तो संत रैदास जी की भक्ति की शक्ति का केंद्र भी ये काशी बनी: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

काशी अहिंसा,तप की प्रतिमूर्ति चार जैन तीर्थंकरों की धरती है।

राजा हरिश्चंद्र की सत्यनिष्ठा से लेकर वल्लभाचार्य,रमानन्द जी के ज्ञान तक

चैतन्य महाप्रभु,समर्थगुरु रामदास से लेकर स्वामी विवेकानंद,मदनमोहन मालवीय तक

कितने ही ऋषियों,आचार्यों का संबंध काशी की पवित्र धरती से रहा है: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

छत्रपति शिवाजी महाराज के चरण यहाँ पड़े थे।

रानीलक्ष्मी बाई से लेकर चंद्रशेखर आज़ाद तक, कितने ही सेनानियों की कर्मभूमि-जन्मभूमि काशी रही है।

भारतेन्दु हरिश्चंद्र, जयशंकर प्रसाद, मुंशी प्रेमचंद,पंडित रविशंकर, और बिस्मिल्लाह खान जैसी प्रतिभाएं

इस स्मरण को कहाँ तक ले जाया जाये: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

काशी विश्वनाथ धाम का लोकार्पण, भारत को एक निर्णायक दिशा देगा, एक उज्जवल भविष्य की तरफ ले जाएगा।

ये परिसर, साक्षी है हमारे सामर्थ्य का, हमारे कर्तव्य का।

अगर सोच लिया जाए, ठान लिया जाए, तो असंभव कुछ भी नहीं: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

हर भारतवासी की भुजाओं में वो बल है, जो अकल्पनीय को साकार कर देता है।

हम तप जानते हैं, तपस्या जानते हैं, देश के लिए दिन रात खपना जानते हैं।

चुनौती कितनी ही बड़ी क्यों ना हो, हम भारतीय मिलकर उसे परास्त कर सकते हैं: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

आज का भारत अपनी खोई हुई विरासत को फिर से संजो रहा है।

यहां काशी में तो माता अन्नपूर्णा खुद विराजती हैं।

मुझे खुशी है कि काशी से चुराई गई मां अन्नपूर्णा की प्रतिमा, एक शताब्दी के इंतजार के बाद अब फिर से काशी में स्थापित की जा चुकी है: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

मेरे लिए जनता जनार्दन ईश्वर का ही रूप है, हर भारतवासी ईश्वर का ही अंश है, इसलिए मैं कुछ मांगना चाहता हूं।

मैं आपसे अपने लिए नहीं, हमारे देश के लिए तीन संकल्प चाहता हूं- स्वच्छता, सृजन और आत्मनिर्भर भारत के लिए निरंतर प्रयास: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

गुलामी के लंबे कालखंड ने हम भारतीयों का आत्मविश्वास ऐसा तोड़ा कि हम अपने ही सृजन पर विश्वास खो बैठे।

आज हजारों वर्ष पुरानी इस काशी से, मैं हर देशवासी का आह्वान करता हूं- पूरे आत्मविश्वास से सृजन करिए, Innovate करिए, Innovative तरीके से करिए: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

तीसरा एक संकल्प जो आज हमें लेना है, वो है आत्मनिर्भर भारत के लिए अपने प्रयास बढ़ाने का।

ये आजादी का अमृतकाल है। हम आजादी के 75वें साल में हैं।

जब भारत सौ साल की आजादी का समारोह बनाएगा, तब का भारत कैसा होगा, इसके लिए हमें अभी से काम करना होगा: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

***

DS/AK



(Release ID: 1781029) Visitor Counter : 207