భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

అన్ని రాష్ట్రాలు/యూటీల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల సమావేశాన్ని ఈసీఐ నిర్వహిస్తుంది

प्रविष्टि तिथि: 23 NOV 2021 11:15AM by PIB Hyderabad

భారత ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాలు/యూటీల ప్రధాన ఎన్నికల అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. ఎలక్టోరల్ రోల్, పోలింగ్ స్టేషన్‌లు, కొనసాగుతున్న ప్రత్యేక సమ్మరీ రివిజన్, ఐటీ అప్లికేషన్‌లు, ఫిర్యాదుల సకాలంలో పరిష్కారం, ఈవీఎంలు/వివిపాట్‌లు, శిక్షణ మరియు పోలింగ్ సిబ్బంది సామర్థ్యం పెంపుదల, మీడియా & కమ్యూనికేషన్ మరియు విస్తృతమైన ఓటరుకు సంబంధించిన వివిధ నేపథ్య సమస్యలను చర్చించడానికి మరియు సమీక్షించడానికి ఈ సమావేశం నిర్వహించబడింది.

image.png

సిఈసీ శ్రీ సుశీల్ చంద్ర తన ప్రసంగంలో సీఈఓలు రాష్ట్రాలలో కమిషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందున వారి ప్రభావం మరియు దృశ్యమానత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఓటర్ల జాబితా స్వచ్ఛత, కనీస సౌకర్యాల లభ్యత మరియు ఓటర్లందరికీ అన్ని పోలింగ్ బూత్‌లలో మెరుగైన సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆయన సీఈఓలను కోరారు. ముఖ్యంగా ఓటరు నమోదుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని సీఈఓలను కోరారు. వాస్తవానికి మెరుగైన ఓటరు అనుభవం ఉండేలా అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించేందుకు సీఈవోలు ఎప్పటికప్పుడు వారితో సంప్రదింపులు జరపాలని  ఆయన అన్నారు.

సిఈసీ శ్రీ సుశీల్ చంద్ర తన ప్రసంగంలో మాట్లాడుతూ ఈ సదస్సు యొక్క లక్ష్యం దేశంలోని అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో కమిషన్ సూచనలను ఒకే విధంగా అమలు చేసేలా చూసేందుకు అవాంతరాలను సవాళ్లను గుర్తించడమని చెప్పారు. ఎన్నికల సంబంధిత కార్యకలాపాల కోసం సిఈఓలులు కొత్త కార్యక్రమాలు మరియు ఉత్తమ అభ్యాసాలను మెరుగుపరచడం కోసం మీడియా ద్వారా క్రమం తప్పకుండా ప్రచారం చేయాలని కూడా సిఈసీ ఉద్ఘాటించింది.

ఎన్నికల కమీషనర్ శ్రీ రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల అధికారులతో సంభాషిస్తూ ఎన్నికల చట్టపరమైన మరియు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ చాలా పటిష్టంగా ఉందని, అయితే క్షేత్రస్థాయిలో కమిషన్ యొక్క వివిధ సూచనలను అమలు చేయడం చాలా క్లిష్టమైనదని అన్నారు. సిఈఓలు వినూత్నంగా, మరింత చురుకుగా ఉండాలని మరియు ఒకరి ఉత్తమ పద్ధతులు మరియు సవాళ్ల నుండి మరొకరు నేర్చుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. సమన్వయం మరియు పర్యవేక్షణ కోసం డిఈఓలతో క్రమం తప్పకుండా సంభాషించాలని మరియు అవసరమైన కోర్సు సవరణలను నిర్ధారించడానికి క్లిష్టమైన అభిప్రాయాల కోసం క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన సిఈఓలను కోరారు.

ఎన్నికల కమీషనర్ శ్రీ అనూప్ చంద్ర పాండే బిఎల్‌ఓల శిక్షణ & సామర్థ్య పెంపుదల గురించి నొక్కిచెప్పారు. ఎందుకంటే ఈసీఐ కార్యకలాపాల ప్రభావం క్షేత్ర స్థాయి ఎన్నికల అధికారులు సమర్థవంతంగా అమలు చేయడంపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికలేతర కాలంలో కూడా ఏడాది పొడవునా గ్రౌండ్ లెవెల్‌లో ఔట్‌రీచ్ &స్వీప్‌ కార్యకలాపాల కోసం రంగంలోని వివిధ వాటాదారులు మరియు అధికారుల ప్రమేయం గురించి కూడా ఆయన నొక్కి చెప్పారు. మెరుగైన ఔట్రీచ్ కోసం స్థానిక మీడియాతో సరైన సమాచారం మరియు వాస్తవాలు క్రమం తప్పకుండా పంచుకునేలా సిఈఓలు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

సెక్రటరీ జనరల్ శ్రీ ఉమేష్ సిన్హా స్వాగతోపన్యాసం చేస్తూ.. క్షేత్ర స్థాయి పనితీరు, వివిధ వాటాదారులతో సమన్వయం మరియు కమిషన్ సూచనల అమలును అర్థం చేసుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఈఓలు ఏడాది పొడవునా యాక్టివ్‌గా ఉండాలని, మూల్యాంకనం మరియు అవసరమైన కోర్సు సవరణల కోసం ఎన్నికల అధికారులతో క్రమం తప్పకుండా నిమగ్నమై ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.

 

image.png

కాన్ఫరెన్స్ సందర్భంగా కమిషన్ నిన్న  'ఎన్నికల చట్టంపై కేసుల సంకలనం' విడుదల చేసింది. కమిషన్ “అస్సాం శాసనసభ 2021కి సాధారణ ఎన్నికల నిర్వహణ” అనే కాఫీ టేబుల్ బుక్‌ను మరియు సిఈఓ అస్సాం అభివృద్ధి చేసిన “కాల్ ఆఫ్ డ్యూటీ” అనే చిన్న వీడియోను కూడా విడుదల చేసింది. సూదూర & క్లిష్ట ప్రాంతాలలో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంలో ఎన్నికల అధికారులు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను వీడియో హైలైట్ చేస్తుంది. కొత్త ఓటర్ల కోసం సీఈవో మణిపూర్‌ రూపొందించిన “పవర్‌ ఆఫ్‌ 18” పేరుతో ఓటరు గీతాన్ని కూడా సదస్సు సందర్భంగా విడుదల చేశారు.

రాష్ట్రాలు/యూటీల ద్వారా ఫోటో ఎలక్టోరల్ రోల్ 2022(ఎస్‌ఎస్‌ఆర్‌2022) ప్రత్యేక సారాంశ సవరణ కోసం ఎస్‌విఈఈపి కార్యకలాపాల మల్టీమీడియా ప్రదర్శన కూడా ఈ సమావేశంలో ప్రదర్శించబడింది. రాష్ట్రాలు/యూటీల నుండి స్వీకరించబడిన ఎస్‌ఎస్‌ఆర్‌ 2022 కోసం స్టేట్ ఐకాన్‌ల నుండి వివిధ ఆడియో విజువల్ క్రియేటివ్‌లు, ప్రింట్ ప్రకటనలు మరియు సందేశాలు ప్రదర్శించబడ్డాయి.


image.png
ఈ కాన్ఫరెన్స్‌లో అన్ని రాష్ట్రాలు/యూటీల నుండి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, సీనియర్ డిఈసీలు, డిఈసీలు,డిజీలు మరియు కమిషన్‌లోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఈరోజు ఈసీఐ పోలింగ్‌ జరుగుతున్న రాష్ట్రాలతో  ఒకరోజు ప్రత్యేక సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తుంది.



 

****


(रिलीज़ आईडी: 1774377) आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Tamil , Kannada , Malayalam