ప్రధాన మంత్రి కార్యాలయం

రాణీ లక్ష్మీబాయి జయంతి నేపథ్యంలో ఆమెకు ప్రధానమంత్రి అభివందనం

Posted On: 19 NOV 2021 8:57AM by PIB Hyderabad

  రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో-

“వీరనారి రాణీ లక్ష్మీబాయి జయంతి నేపథ్యంలో ఆమెకు అభివందనం సమర్పిస్తున్నాను. భారతదేశ చరిత్రలో ఆమెది ప్రత్యేక స్థానం. ఆమె ధైర్యసాహసాలు తరతరాలకూ చిరస్మరణీయాలు. ఈ సందర్భంగా భారత రక్షణ రంగానికి ఉత్తేజమిచ్చే కార్యక్రమాలకు ఇవాళ హాజరవడం కోసం ఝాన్సీ వెళ్లేందుకు నేను ఎదురుచూస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1773278) Visitor Counter : 150