ప్రధాన మంత్రి కార్యాలయం

జమ్ము, కశ్మీర్ లో జరిగినరోడ్డు ప్రమాదం లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


బాధితులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం చెల్లించడానికి ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు

Posted On: 28 OCT 2021 11:38AM by PIB Hyderabad

జమ్ము, కశ్మీర్ లోని డోడా లో ధాథ్ రీ కి దగ్గర లో జరిగిన ఒక రోడ్డు ప్రమాద ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇప్పించడానికి కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘జమ్ము, కశ్మీర్ లోని డోడా లో గల థాథ్ రీ సమీపం లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన దుఃఖాన్ని కలిగించింది. ఈ విషాద ఘడియ లో, ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.

గాయపడ్డ వారు అతి త్వరలోనే కోలుకోవాలి అని నేను ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi

జమ్ము, కశ్మీర్ లో రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతుల పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. క్షతగాత్రుల కు 50,000 రూపాయాలు ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 



(Release ID: 1767139) Visitor Counter : 126