ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జమ్ము, కశ్మీర్ లో జరిగినరోడ్డు ప్రమాదం లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


బాధితులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం చెల్లించడానికి ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు

Posted On: 28 OCT 2021 11:38AM by PIB Hyderabad

జమ్ము, కశ్మీర్ లోని డోడా లో ధాథ్ రీ కి దగ్గర లో జరిగిన ఒక రోడ్డు ప్రమాద ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇప్పించడానికి కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘జమ్ము, కశ్మీర్ లోని డోడా లో గల థాథ్ రీ సమీపం లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన దుఃఖాన్ని కలిగించింది. ఈ విషాద ఘడియ లో, ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.

గాయపడ్డ వారు అతి త్వరలోనే కోలుకోవాలి అని నేను ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi

జమ్ము, కశ్మీర్ లో రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతుల పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. క్షతగాత్రుల కు 50,000 రూపాయాలు ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 


(Release ID: 1767139)