ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర్ ప్రదేశ్ లో ఒక రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి; బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్నిఇవ్వడానికి ఆయన ఆమోదం తెలిపారు
Posted On:
07 OCT 2021 11:35AM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ లో జరిగిన ఒక రహదారి ప్రమాద ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇచ్చేందుకు కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –
‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ లో జరిగిన రహదారి ప్రమాద ఘటన నాకు బాధ ను కలిగించింది. ఈ ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ ఘటన లో గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటన లో మరణించిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’
అని పేర్కొంది.
***
DS/SH
(Release ID: 1761744)
Visitor Counter : 179
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam