ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

89.74 కోట్ల డోసులను దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 69.33 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

97.86 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి తర్వాత గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 24,354 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (2,73,889) 0.81 శాతం

వారపు పాజిటివిటీ రేటు (1.68 శాతం) గత 99 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 02 OCT 2021 9:42AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 89 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 69,33,838 డోసులతో కలిపి, మొత్తంగా 88.74 కోట్ల డోసులను (89,74,81,554) టీకా కార్యక్రమం అధిగమించింది. 87,06,441 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,73,287

రెండో డోసు

89,07,790

 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,54,007

రెండో డోసు

1,50,47,392

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

36,35,39,734

రెండో డోసు

8,51,18,303

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

16,03,02,227

రెండో డోసు

7,75,18,029

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,17,62,489

రెండో డోసు

5,65,58,296

మొత్తం

89,74,81,554

 

గత 24 గంటల్లో 25,455 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,30,68,599 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.86 శాతానికి చేరింది. 2020 మార్చి తర్వాత ఇది గరిష్ట స్థాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WWVX.jpg

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 97వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 24,354 కొత్త కేసులు నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003HGC8.jpg

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,73,889. ఇది 197 రోజుల కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.81 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004O2ZW.jpg

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,29,258 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57.19 కోట్లకుపైగా (57,19,94,990) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది. గత 99 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 33 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 116 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0059FMP.jpg

 

 

****



(Release ID: 1760327) Visitor Counter : 193