ప్రధాన మంత్రి కార్యాలయం

తుపాను ప‌రిస్థితిపై ఒడిషా ముఖ్య‌మంత్రితో చ‌ర్చించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 26 SEP 2021 5:58PM by PIB Hyderabad

ఒడిషాలోని కొన్నిప్రాంతాల‌లో తుపాను ప‌రిస్థితుల‌పై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , ఒడిషా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌తో చ‌ర్చించారు.
ఇందుకు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశ‌మిస్తూ,
ఒడిషా లోని ప‌లు ప్రాంతాల‌లో తుపాను ప‌రిస్థితిపై  ఒడిషా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ జీ తో చ‌ర్చించ‌డం జ‌రిగింది. ఈ ప్ర‌తికూల ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కేంద్రం సాధ్య‌మైన అన్ని ర‌కాల అండగా ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రి భ‌ద్ర‌త , సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నాను.

***

DS/SH



(Release ID: 1758367) Visitor Counter : 143