ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశ ప్రజలకు ఒక్కరోజులో 1.13 కోట్ల కొవిడ్‌ టీకాలు అందించిన భారత్‌


69.90 కోట్ల డోసులను దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

97.48 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 31,222 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,92,864) 1.19 శాతం

వారపు పాజిటివిటీ రేటు (2.56 శాతం) గత 74 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 07 SEP 2021 9:53AM by PIB Hyderabad

సార్వత్రిక కొవిడ్‌ టీకా కార్యక్రమంలో భారత్‌ మరోమారు 'కోటి మార్కు' ఘనత సాధించింది. ఒక్క రోజులోనే కోటికిపైగా టీకా డోసులను ప్రజలకు అందించింది. ఇలా కోటికిపైగా టీకాలు వేయడం గత 11 రోజుల్లో ఇది మూడోసారి. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 1,13,53,571 కొవిడ్‌ టీకాలతో కలిపి గత దేశవ్యాప్తంగా ఇచ్చిన డోసుల సంఖ్య 69.90 కోట్లను (69,90,62,776) దాటింది. 72,26,439 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

హెచ్‌సీడబ్ల్యూలు

మొదటి డోసు

1,03,61,392

రెండో డోసు

85,01,490

 

ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు

మొదటి డోసు

1,83,31,433

రెండో డోసు

1,36,58,274

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

27,76,44,784

రెండో డోసు

3,59,16,927

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

13,80,26,694

రెండో డోసు

5,89,70,434

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

9,03,51,520

రెండో డోసు

4,72,99,828

మొత్తం

69,90,62,776

 

దేశవ్యాప్తంగా టీకాల వేగాన్ని పెంచడానికి, పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

గత 24 గంటల్లో 42,942 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,22,24,937కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.48 శాతానికి చేరింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021JR4.jpg

 

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 72వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 31,222 కొత్త కేసులు నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0036Q2N.jpg

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 3,92,864. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 1.19 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0044UMZ.jpg

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 15,26,056 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 53.31 కోట్లకుపైగా (53,31,89,348) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.56 శాతంగా ఉంది. గత 74 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 8 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 92 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ULFS.jpg

 

****



(Release ID: 1752779) Visitor Counter : 189