ప్రధాన మంత్రి కార్యాలయం
గురువులదినం నాడు గురు సముదాయానికి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి; పూర్వ రాష్ట్రపతిడాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 SEP 2021 9:16AM by PIB Hyderabad
టీచర్స్ డే సందర్భం లో గురువుల సముదాయానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.
‘‘టీచర్స్ డే నాడు, యావత్తు గురు సముదాయానికి ఇవే అభినందన లు. వారు యువ మస్తిష్కాల ను దిద్ది తీర్చడంలో ఎల్లప్పుడూ ఒక కీలకమైన పాత్ర ను పోషిస్తూ వస్తున్నారు. కోవిడ్-19 కాలం లో కొత్త కొత్త పద్ధతుల లో విద్యార్థుల విద్య యాత్ర కొనసాగేటట్లు చేసిన గురువు ల కృషి అభినందనీయం.
డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ జయంతి నాడు ఆయన కు నా వందనాలను అర్పిస్తూ ఆయన విశిష్ట పాండిత్యాన్ని, అలాగే మన దేశ ప్రజల కు ఆయన అందించిన తోడ్పాటుల ను కూడా గుర్తుకు తెచ్చుకొంటున్నాను.’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1752352)
సందర్శకుల సూచీ సంఖ్య : : 203
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam