ఉక్కు మంత్రిత్వ శాఖ

'ఆజాది కా అమృత్ మహోత్సవ్‌' జ్ఞాపకార్థం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్‌లో పాల్గొన్న సెయిల్ రూర్కెలా స్టీల్ ప్లాంట్‌

Posted On: 03 SEP 2021 1:06PM by PIB Hyderabad

'ఆజాది కా అమృత్ మహోత్సవ్' పుర‌స్క‌రించుకొని ఫిట్‌నెస్ డ్రైవ్‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్‌ కార్య‌క్ర‌మంలో 'భార‌త ఉక్కు ప్రాధికారిక సంస్థ' (సెయిల్‌కు) చెందిన రూర్కెలా స్టీల్ ప్లాంట్ పాల్గొంది. బీఎస్‌ఎల్, ఆర్‌ఎస్‌పీ డైరెక్టర్ ఇంచార్జ్ శ్రీ అమరేందు ప్రకాశ్ ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రకాశ్‌ మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రూ వారి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని సూచించారు. 'ఫిట్‌నెస్ కి డోస్ ఆదా ఘంటా రోజ్' అనే మంత్రాన్ని అవలంబించాలంటూ అయ‌న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించారు.
ఆరోగ్యం, భద్రత రెండు ప్రాధానాంశాల‌ని ఈ విష‌యంలో రాజీపడలేమని డీఐసీ వివ‌రించారు.
ప్రతి ఒక్కరూ తమ జీవ‌న విధానంలో రోజుకు కనీసం ముప్పై నిమిషాల శారీరక శ్రమను చేర్చుతామని ప్రతిజ్ఞ తీసుకోనే వేడుకతో ఈ ప‌రుగు ప్రారంభమైంది. 'రన్ ఫర్  ఇండియా కార్య‌క్ర‌మం' ప్రధాన లక్ష్యం 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య వేడుకల‌లో దేశ పౌరులను మరింత ఎక్కువగా భాగస్వామ్యుల‌ను చేయడం మరియు దేశంలోని ప్రతి పౌరుడి ఆరోగ్యం, ఫిట్‌నెస్ మరియు శ్రేయస్సును నిర్ధారించడం.

***



(Release ID: 1751747) Visitor Counter : 201