రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మిషన్ సాగర్‌లో భాగంగా, వైద్య సామగ్రిని అందించడానికి జకార్తా చేరుకున్న ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌

Posted On: 24 AUG 2021 11:51AM by PIB Hyderabad

భారత నౌకాదళానికి చెందిన ల్యాండింగ్ షిప్‌ ట్యాంక్ (లార్జ్‌) ఐఎన్ఎస్ ఐరావత్, ఇండోనేషియా అభ్యర్థించిన 10 ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) కంటైనర్లను అందించడానికి జకార్తాలోని టాంజుంగ్ ప్రియోక్ పోర్టుకు ఇవాళ చేరుకుంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Pic(1)T91D.jpeg

    మిషన్ సాగర్‌లో భాగంగా భారత్‌ ఇండోనేషియాకు ఈ సాయం అందిస్తోంది. జకార్తాలో వైద్య సామగ్రి దిగడం పూర్తయిన తర్వాత, ఇతర మిత్ర దేశాలకు కూడా వైద్య సామగ్రిని అందించడానికి ఐఎన్ఎస్ ఐరావత్‌ ముందుకు సాగుతుంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Pic(3)6N4J.jpeg

    ఉభయచర కార్యకలాపాలను నిర్వహించడం ఐఎన్ఎస్ ఐరావత్ ప్రాథమిక పాత్ర. దీంతోపాటు, హెచ్‌ఏడీఆర్‌ మిషన్లను కూడా నిర్వహిస్తోంది. గతంలో హిందూ మహాసముద్రంలో చేపట్టిన వివిధ సహాయక చర్యల్లో ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ పాలు పంచుకుంది. ఈ ఏడాది జులై 24న కూడా, ఇండోనేషియాకు 5 ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ కంటైనర్లు (100 మె.ట.), 300 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఇదే నౌక అందజేసింది.

    భారత్‌, ఇండోనేషియా ఒక బలమైన సాంస్కృతిక బంధం, భాగస్వామ్యం కలిగిన దేశాలు. సురక్షితమైన ఇండో-పసిఫిక్ కోసం సముద్రంపై కలిసి పనిచేస్తున్నాయి. ద్వైపాక్షిక విన్యాసాలు, సమన్వయ గస్తీ రూపంలో ఈ రెండు నౌకాదళాలు ఎప్పటికప్పుడు ఉమ్మడి నావికా విన్యాసాలను కూడా నిర్వహిస్తున్నాయి.

***



(Release ID: 1748495) Visitor Counter : 255