సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కెవిఐసీ 75 రైల్వే స్టేషన్లలో ఖాదీ ఎగ్జిబిషన్ మరియు అమ్మకపు కేంద్రాలను ఏర్పాటు చేసింది

Posted On: 16 AUG 2021 11:25AM by PIB Hyderabad

75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కేవిఐసీ) దేశంలోని 75 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ స్టాల్‌లను ఏర్పాటు చేసింది. ఏడాది పాటు అంటే 2022 స్వాతంత్ర్య దినోత్సవం వరకు ఈ స్టాల్స్ కొనసాగుతాయి. "ఆజాది కా అమృత్ మహోత్సవ్" లో ఈ కార్యక్రమం ఒక భాగం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001EA2T.jpg



ఈ ఖాదీ స్టాల్స్ 75 రైల్వే స్టేషన్లలో శనివారం ప్రారంభించబడ్డాయి. న్యూ ఢిల్లీ, సిఎస్‌టిఎం ముంబై, నాగ్‌పూర్, జైపూర్, అహ్మదాబాద్, సూరత్, అంబాలా కంటోన్మెంట్, గ్వాలియర్, భోపాల్, పాట్నా, ఆగ్రా, లక్నో, హౌరా, బెంగళూరు, ఎర్నాకుళం మరియు ఇతరుల ప్రధాన రైల్వే స్టేషన్లు ఇందులో ఉన్నాయి. ఈ స్టాల్‌లో ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా రాష్ట్రానికి చెందిన వివిధ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులైన ఫాబ్రిక్, రెడీమేడ్ వస్త్రాలు, ఖాదీ సౌందర్య ఉత్పత్తులు, తినే పదార్ధాలు, తేనె, కుండలు మొదలైనవి అందుబాటులో ఉంటాయి.  ఖాదీ చేతివృత్తుల వారికి వారి చేతిపనుల ఉత్పత్తులను విక్రయించడానికి మరియు ప్రోత్సహించడానికి ఇది పెద్ద మార్కెటింగ్ వేదికను అందిస్తుంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002X5M4.jpg



కెవిఐసీ ఛైర్మన్ శ్రీ వినై కుమార్ సక్సేనా ఈ చొరవను స్వాగతించారు. రైల్వేలు మరియు కెవిఐసీల ఈ సమిష్టి కృషి ఖాదీ కళాకారులను శక్తివంతం చేస్తుంది. "ఈ 75 రైల్వే స్టేషన్‌లలోని ఖాదీ స్టాల్‌లు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి మరియు తద్వారా విస్తృత శ్రేణి ఖాదీ ఉత్పత్తులను ప్రాచుర్యం పొందడంలో సహాయపడతాయి. ఇది "స్వదేశీ" ని ప్రోత్సహించడమే కాకుండా ప్రభుత్వం యొక్క "వోకల్ ఫర్ లోకల్" చొరవను బలపరుస్తుంది "అని సక్సేనా చెప్పారు.
 

 

****



(Release ID: 1746318) Visitor Counter : 240