ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్ర లో వరద స్థితి ని గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 22 JUL 2021 9:18PM by PIB Hyderabad

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ ఠాకరే తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు. భారీ వర్షపాతం, వరద ల నేపథ్యం లో మహారాష్ట్ర లో కొన్ని ప్రాంతాల లో తలెత్తిన స్థితి ని గురించి ప్రధాన మంత్రి చర్చించారు.

 

‘‘ మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ ఠాకరే తో మాట్లాడాను. భారీ వర్షపాతం మరియు వరద ల నేపథ్యం లో మహారాష్ట్ర లో కొన్ని ప్రాంతాల లో తలెత్తిన స్థితి ని గురించి ఆయన తో చర్చించాను. స్థితి తీవ్రత ను తగ్గించడం కోసం కేంద్రం సాధ్యమైన అన్ని విధాలైన సహకారాన్ని అందిస్తుంది అంటూ భరోసా ను ఇచ్చాను. ప్రతి ఒక్కరి సురక్ష కోసం, ప్రతి ఒక్కరి శ్రేయం కోసం ప్రార్థిస్తున్నాను. @OfficeofUT ’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

***

***

DS/SH

 



(Release ID: 1738064) Visitor Counter : 171