ప్రధాన మంత్రి కార్యాలయం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో భారీ వర్షం పై ఆందోళ‌న ను వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 12 JUL 2021 5:34PM by PIB Hyderabad

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో భారీ వర్షం కురుస్తుండడం పై ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆందోళ‌న ను వ్య‌క్తం చేశారు.  పరిస్థితి ని ఎప్ప‌టిక‌ప్పుడు నిశితం గా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

‘‘భారీ వర్షం కార‌ణం గా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో త‌లెత్తిన స్థితి ని నిశితం గా ప‌ర్య‌వేక్షించ‌డం జ‌రుగుతోంది.  అధికారులు రాష్ట్ర ప్ర‌భుత్వం తో క‌ల‌సి ప‌ని చేస్తున్నారు.  సాధ్య‌మైన అన్ని ర‌కాలుగాను సాయాన్ని అందించ‌డం జ‌రుగుతోంది.  ప్ర‌భావిత ప్రాంతాల లో ఉన్న ప్ర‌జ‌ల సుర‌క్ష కోసం నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1734855) Visitor Counter : 136