ప్రధాన మంత్రి కార్యాలయం

కల్యాణ్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న అసంఖ్యాక ప్రజానీకం తో పాటు తాను కూడా ప్రార్థిస్తున్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 JUL 2021 10:13AM by PIB Hyderabad

కల్యాణ్ సింహ్ గారి మనవడి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. జబ్బుపడ్డ కల్యాణ్ సింహ్ గారికి త్వరగా నయం అవ్వాలి అని ఆ ఈశ్వరుడి ని ప్రధాన మంత్రి ప్రార్థించారు.  కల్యాణ్ సింహ్ గారి తో తాను జరిపిన సమావేశాల గురించి కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తు కు తెచ్చుకొన్నారు.  కల్యాణ్ సింహ్ గారి తో మాట్లాడిన ప్రతి సారీ తాను పలు విషయాలు నేర్చుకోగలిగానని ప్రధాన మంత్రి చెప్పారు.  

ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో ఇలా పేర్కొన్నారు:

‘‘ భారతదేశం అంతటా లెక్కపెట్టలేనంత మంది కల్యాణ్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలి అని ప్రార్థన లు చేస్తున్నారు.  నిన్నటి రోజు న, @JPNadda Ji, ముఖ్యమంత్రి @myogiadityanath Ji మరియు ఇతరులు ఆయన ను కలుసుకోవడం కోసమని ఆసుపత్రి కి వెళ్లారు.  నేను కాసేపటి క్రితమే ఆయన మనవడి తో మాట్లాడాను, ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకొన్నాను.

కల్యాణ్ సింహ్ గారు @JPNadda Ji తో మాట్లాడినప్పుడు నా గురించి గుర్తు కు తెచ్చుకొన్నారని తెలిసి నేను చలించిపోయాను.  కల్యాణ్ సింహ్ గారి తో నేను జరిపిన సంభాషణ ల తాలూకు జ్ఞాపకాలు నాకు కూడాను అనేకం ఉన్నాయి.  అటువంటి స్మృతుల లో అనేకం తిరిగి ప్రాణం పోసుకొన్నాయి.  ఆయనతో మాట్లాడటం అంటే అది ఎల్లప్పటికీ ఒక జ్ఞానార్జన తాలూకు అనుభవం వంటిదే. ’’

 

 

******

DS/SH


(రిలీజ్ ఐడి: 1734128) సందర్శకుల సూచీ సంఖ్య : : 174