ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

35 కోట్ల మైలురాయి దాటిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ


వారం రోజులుగా 50,000 లోపు కొత్త కోవిడ్ కేసులు

చికిత్సలో ఉన్న కేసులు 4,85,350 ; మొత్తం కేసుల్లో 1.59% మాత్రమే

రోజువారీ పాజిటివిటీ 2.34%; 27 రోజులుగా 5% లోపే

Posted On: 04 JUL 2021 9:48AM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిన్నటికి 3కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 46,04,925 శిబిరాల ద్వారా 35,12,21,306 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 63,87,849 టీకాలిచ్చారువాటి వివరాలు

 

అరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,27,957

రెండో డోస్

73,08,968

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,75,81,755

రెండో డోస్

96,55,149

18-44 వయోవర్గం

మొదటి డోస్

9,98,28,219

రెండో డోస్

27,26,338

45-59 వయోవర్గం

మొదటి డోస్

9,05,89,022

రెండో డోస్

1,86,76,107

 60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

6,89,10,208

రెండో డోస్

2,57,17,583

మొత్తం

35,12,21,306

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు  చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  43,071 కొత్త కరోనా కేసులు  నమోదయ్యాయి. ఆ విధంగా రోజుకు 50 వేల లోపు కేసులు రావటం గత వారం రోజులుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001EEAN.jpg

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,85,350.మంది.. చికిత్సలో ఉన్నవారు నికరంగా 10,183 మంది గత 24 గంటల్లోనే తగ్గగా చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.59% మాత్రమే.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BWUD.jpg

కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 52 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24  గంటలలో  52,299 మంది కోలుకున్నారు.  అంతకు ముందురోజు కంటే 9,228మంది అదనంగా కోలుకున్నారు

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Q04Y.jpg 

ఇప్పటివరకూ కోవిడ్ బారిని పడి కోలుకున్నవారు 2,96,58,078 మంది కాగా గత 24 గంటలలో 52,299 మంది కోలుకున్నారు.  దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం 97.09% కు పెరిగింది.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00468DG.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 18,38,490 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన  మొత్తం పరీక్షలు 41.82 కోట్లకు పైగా (41,82,54,953) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.44కాగా రోజువారీ పాజిటివిటీ  2.34%  అయింది. వరుసగా 27 రోజులుగా  ఇది 5% లోపే ఉంటోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005CBX6.jpg



(Release ID: 1732615) Visitor Counter : 208