ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మొత్తం 34.46 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ


వరుసగా 6 రోజులుగా 50,000 లోపు కేసులు

97 రోజుల తరువాత చికిత్సలో ఉన్న కేసులు 5 లక్షల లోపు

రోజువారీ పాజిటివిటీ 2.35%, వరుసగా 26 రోజులుగా 5% లోపే

Posted On: 03 JUL 2021 10:38AM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిన్నటికి 34 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 45,60,088 శిబిరాల ద్వారా 34,46,11,291 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 43,99,298 టీకాలిచ్చారువాటి వివరాలు

 

అరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,22,008

రెండో డోస్

72,87,445

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,75,60,592

రెండో డోస్

95,89,619

18-44 వయోవర్గం

మొదటి డోస్

9,64,91,993

రెండో డోస్

23,80,048

45-59వయోవర్గం

మొదటి డోస్

8,98,65,131

రెండో డోస్

1,75,25,281

 60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

6,86,03,725

రెండో డోస్

2,50,85,449

మొత్తం

34,46,11,291

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు  చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  44,111 కొత్త కరోనా కేసులు  నమోదయ్యాయి. ఆ విధంగా రోజుకు 50 వేల లోపు కేసులు రావటం గత 6 రోజులుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012LRE.jpg

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,95,533 మంది. 97 రోజుల తరువాత ఈ సంఖ్య 5 లక్షల లోపుకు పడిపోయింది. చికిత్సలో ఉన్నవారు నికరంగా 14,104 మంది గత 24 గంటల్లోనే తగ్గగా చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.62% మాత్రమే.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002D7H5.jpg

కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 51 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24  గంటలలో  57,477 మంది కోలుకున్నారు.  అంతకు ముందురోజు కంటే 13,366మంది అదనంగా కోలుకున్నారు

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0031E22.jpg

 

ఇప్పటివరకూ కోవిడ్ బారిని పడి కోలుకున్నవారు 2,96,05,779 మంది కాగా గత 24 గంటలలో 57,477 మంది కోలుకున్నారు.  దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం 97.06% కు పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004292N.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 18,76,036 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన  మొత్తం పరీక్షలు 41.64 కోట్లకు పైగా (41,64,16,463) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.50కాగా రోజువారీ పాజిటివిటీ  2.35%  అయింది. వరుసగా 26రోజులుగా  ఇది 5% లోపే ఉంటోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005FQAO.jpg 



(Release ID: 1732496) Visitor Counter : 193