ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో 33.28 కోట్లకు పెరిగిన టీకా డోసుల పంపిణీ


గత 24 గంటల్లో 45,951 కొత్త కోవిడ్ కేసులు; ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 5,37,064; మొత్తం కేసుల్లో ఇవి 1.77% మాత్రమే

వరుసగా 3 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే

రోజువారీ పాజిటివిటీ 2.34%; 23 రోజులుగా 5% లోపే

Posted On: 30 JUN 2021 10:39AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసులు నిన్న 33 కోట్లు దాటాయి. 44,33,853 శిబిరాల ద్వారా33,28,54,527  టీకాలిచ్చినట్టు ఈ ఉదయం 7 గంటలకు సమాచారం. గత 24 గంటలలో 36,51,983 టీకా డోసుల పంపిణీ జరిగింది

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,08,162

రెండో డోస్

72,43,081

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,74,84,539

రెండో డోస్

94,80,633

 18-44 వయోవర్గం

మొదటి డోస్

9,00,61,716

రెండో డోస్

20,87,331

45-59వయోవర్గం

మొదటి డోస్

8,82,70,464

రెండో డోస్

1,59,11,279

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

6,79,88,719

రెండో డోస్

2,41,18,603

మొత్తం

33,28,54,527

 

సార్వత్రిక కోవిడ్ టీకాల కార్యక్రమం  2021 జూన్ 16న ప్రారంభం కాగా కేంద్ర ప్రభుత్వం దీని వేగం పెంచటంతోబాటు పరిధి విస్తరించాలని నిర్ణయించి దేశవ్యాప్తంగా అమలులోపెట్టింది.

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 45,951 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలా 50 వేల లోపు కేసులు రావటం వరుసగా ఇది మూడో రోజు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితోనే ఇది సాధ్యమైంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00184E6.jpg

 చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య క్రమేణా తగ్గటం కూడా చూస్తున్నాం. ప్రస్తుతం 5,37,064  మంది కోవిడ్ చికిత్సలో ఉన్నారు. గత 24 గంటలలో వీరి సంఖ్య నికరంగా 15,595 తగ్గింది. మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నది   1.77% మాత్రమే.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Z10D.jpg 

కోవిడ్ బారినుంచి బైటపడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతూ ఉండటంతో రోజువారీ కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. గత 48 రోజులుగా ఇదే ధోరణి కనబడుతోంది. గత 24 గంటలలో 60,729 మంది కోలుకున్నారు. అంతకు ముందు కంటే 14,778 మంది ఎక్కువగా కోలుకోవటం గమనార్హం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Z10D.jpg

కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 2,94,27,330 మంది కోలుకోగా గత 24 గంటల్లో   60,729  మంది కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్నవారి శాతం పెరుగుతూ ప్రస్తుతం అది  96.92% అయింది.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003IGF1.jpg

 

దేశవ్యాప్తంగా కోవిడ్ పరీక్షల సామర్థ్యం బాగా పెరగగా, గత 24 గంటల్లో 19,60,757 పరీక్షలు జరిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 41.01 కోట్లకు పైగా (41,01,00,044) పరీక్షలు జరిగాయి. ఒకవైపు పరీక్షల సామర్థ్యం పెరుగుతూ ఉండగా ఇంకోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ 2.69% నమోదు కాగా రోజువారీ పాజిటివిటీ ఈ రోజు 2.34% గా నమోదైంది ఇది గత 23 రోజులుగా 5% లోపే ఉంటోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0058WFO.jpg



(Release ID: 1731437) Visitor Counter : 224