ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన ఉచిత టీకా డోసులు 20 కోట్లు


రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర 1.84 కోట్ల డోసులకు పైగా నిల్వ
వచ్చే 3 రోజుల్లో రాష్ట్రాలకు అందనున్న 51 లక్షల డోసులు

Posted On: 16 MAY 2021 11:54AM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారీ ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స   అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటింపజేయటం, టీకాలివ్వటం అనే ఐదు అంశాల ప్రాధాన్యంలో భాగంగా  టీకాల మీద  ప్రత్యేక దృష్టిసారించింది. భారత ప్రభుత్వం దేశవ్యాప్త టీకాల కార్యక్రమానికి అండగా ఉండి రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు టీకా డోసులు ఉచితంగా అందిస్తూ వచ్చింది. అంతే కాకుండా ఉత్పత్తి, సరఫరాను పెంచటానికి అనేక చర్యలు తీసుకుంటోంది.

మూడో దశ టీకాల కార్యక్రమాని మరింత సరళంగా, వేగంగా అమలు చేయటం మే 1న మొదలైంది. ఈ వ్యూహంలో భాగంగా ప్రతి నెలలో సెంట్రల్ డ్రగ్స్ లేబరేటరీ ఆమోదించిన ఉత్పత్తి సంస్థలలో తయారైన 50% టీకా మందును కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రాష్ట్రాలు మిగిలిన 50% నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వం అందించే టీకామందు మునుపటిలాగానే రాష్టాలకు ఉచితంగా పంపిణీ జరుగుతుంది.

భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు  దాదాపు 20 కోట్లకు పైగా (20,28,09,250)  కోవిడ్ డోసులు ఉచితంగా అందజేసింది. ఇందులో రాష్ట్రాల వాడకం, వృధా కలిపి 14వ తేదీ వరకు 18,43,67,772 డోసులు ఉన్నట్టు ఈ ఉదయం 7 గంటల వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

రాష్ట్రాల దగ్గర ఇంకా 1.84 కోట్లకు  పైగా  (1,84,41,478) టీకా డోసులు పంపిణీకి అందుబాటులో ఉన్నాయి. కొన్ని చోట్ల లోటు  కనబడుతున్నప్పటికీ అది ఎక్కువ వాడకం లేదా వృధాను చూపుతోంది. సాయుధ దళాలకిచ్చిన టీకాల సంఖ్యను సమన్వయం చేసుకోకపోవటం కూడా కనిపించింది.

పైగా, మరో 51 లక్షల (50,95,640) టీకా డోసులు వచ్చే 3 రోజుల్లో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపబోతోంది

 

 

 

***

 

 

 

 

 

 



(Release ID: 1719082) Visitor Counter : 179