వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కొవిడ్‌ నియంత్రణ కోసం సేకరణల నిబంధనలు సరళీకరణ

Posted On: 14 MAY 2021 11:46AM by PIB Hyderabad

కొవిడ్‌ మహమ్మారిని నియంత్రించడానికి అవసరమైన ప్రజా సేకరణలపై, "ప్రజా సేకరణల ఉత్తర్వు-2017" ప్రకారం వర్తించే నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. భారత్‌లో తయారైన వస్తువులకు ఈ మినహాయింపులో ప్రాధాన్యం ఉంటుంది. "కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ" ఆధ్వర్యంలోని "పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం" ఈ ఆదేశాన్ని జారీ చేసింది. 30.09.2021 వరకు మినహాయింపు అమల్లో ఉంటుందని పేర్కొంది.

 

***



(Release ID: 1718594) Visitor Counter : 185