ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

విదేశీ వైద్య సాయాన్ని రాష్ట్రాలకు సమర్థంగా కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం

పెరిగిన టీకాల పంపిణీ పరిధితో దేశవ్యాప్తంగా 16.73 కోట్లకు చేరిన డోసులు

మూడో దశలో 18-44 వయోవర్గంలో 14.8 లక్షలమందికి టీకాలు

గత 24 గంటలలో 3.18 లక్షలకు పైగా కోలుకున్న కోవిడ్ బాధితులు

Posted On: 08 MAY 2021 12:20PM by PIB Hyderabad

గత కొద్ది వారాలుగా దేశంలో కోవిడ్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య, మరణాల సంఖ్య

ఇలా ఒక్క సారిగా పెరగటంతో అనేక రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలమీద వత్తిడి పెరిగి లోటు ఏర్పడింది. వసుధైవ కుటుంబకమ్

నినాదాన్ని అనుసరిస్తూ ప్రపంచదేశాలు ఈ కోవిడ్ మహమ్మారిమీద పొరాడుతున్న భారత ప్రభుత్వానికి సహాయ హస్తం అందిస్తూ

వస్తున్నాయి. ఇది నిరవధికంగా కొనసాగే ప్రక్రియ. ఈ క్లిష్ట సమయంలో ఈ విధంగా అందిన  సహాయాన్ని వివిధ మార్గాల ద్వారా

అన్ని అవసరమున్న రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ పంపటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

 

ఇప్పటివరకూ 2933 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్ల్లు, 2429 ఆక్సిజెన్ సిలిండర్లు, 13 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు, 2951 వెంటిలేటర్లు,

 3 లక్షలకు పైగా రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు అందజేశారు.  మరోవైపు మూడో దశ టీకాల కార్యక్రమం కూడా వేగం పుంజుకోవటంతో

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 16.73 కోట్లు దాటింది. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 18-44

వయోవర్గం వారు ఈ మూడో దశలో 14,88,528 మంది టీకాలు తీసుకున్నారు.   అవి: అండమాన్-నికోబార్ దీవులు (663),

ఆంధ్రప్రదేశ్  (148), అస్సాం (33,693), బీహార్  (291), చండీగఢ్ (2), చత్తీస్ గఢ్ (1,026), ఢిల్లీ (2,41,870), గోవా

(934), గుజరాత్ (2,47,652), హర్యానా (2,04,101), హిమాచల్ ప్రదేశ్ (14), జమ్మూ-కశ్మీర్ (26,161), జార్ఖండ్ (81),

కర్నాటక (8,681), కేరళ (112), లద్దాఖ్ (86), మధ్యప్రదేశ్ (9,833), మహారాష్ట్ర (3,08,171), మేఘాలయ (2),

నాగాలాండ్ (2), ఒడిశా (35,152), పుదుచ్చేరి (1), పంజాబ్ (2,785), రాజస్థాన్ (2,49,315), తమిళనాడు (10,703),

తెలంగాణ (498), త్రిపుర (2), ఉత్తరప్రదేశ్ (1,02,407), ఉత్తరాఖండ్ (19) పశ్చిమ బెంగాల్ (4,123).

 

ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 24,37,299 శిబిరాల ద్వారా మొత్తం 16,73,46,544 టీకా డోసులివ్వగా

అందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన  95,22,639 మొదటి డోసులు, 64,30,277 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,38,62,998

మొదటి డోసులు,  76,46,634 రెండో డోసులు, 18-45 వయోవర్గానికిచ్చిన 14,88,528 మొదటీ డోసులు,  60 ఏళ్ళు పైబడ్డవారికి

ఇచ్చిన  5,35,04,312 మొదటి డోసులు, 1,42,87,313 రెండో డోసులు, 45-60 ఏళ్ళవారికిచ్చిన  5,47,33,969 మొదటి డోసులు

 58,69,874 రెండో డోసులు ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

95,22,639

2వ డోస్

64,30,277

కోవిడ్ యోధులు

1వ డోస్

1,38,62,998

2వ డోస్

76,46,634

 18-44 వయోవర్గం

1వ డోస్

14,88,528

 45 -60 వయోవర్గం

1వ డోస్

5,47,33,969

2వ డోస్

58,69,874

60పైబడ్డవారు

1వ డోస్

5,35,04,312

2వ డోస్

1,42,87,313

 

మొత్తం

16,73,46,544

 

 ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసులలో 66.81% వాటా పది రాష్టాలదే కావటం గమనార్హం

 

గత 24 గంటలలో దాదాపు 23 లక్షలమందికి కోవిడ్ టీకాలిచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 112 వ రోజైన మే 7న

22,97,257 డోసులు ఇవ్వగా 18,692 శిబిరాల ద్వారా అందులో 9,87,909 మంది మొదటీ డోస్ 13,09,348 మంది

రెండో డోస్ తీసుకున్నారు.  

 

తేదీ: మే 7,  2021 (112వ రోజు)

కొవిడ్ యోధులు

1వ డోస్

20,111

2వ డోస్

36,888

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

92,894

2వ డోస్

1,04,263

18-44 వయోవర్గం

1వ డోస్

3,05,636

45 -60 వయోవర్గం

1వ డోస్

4,01,595

2వ డోస్

4,90,555

60 పైబడ్డవారు

1వ డోస్

1,67,673

2వ డోస్

6,77,642

మొత్తం

1వ డోస్

9,87,909

2వ డోస్

13,09,348

 

భారతదేశంలో ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,79,30,960 కు చేరుకోగా కోలుకున్నవారి శాతం 81.90%.

గత 24 గంటలలో 3,18,609 మంది కోలుకోగా అందులో పది రాష్టాలవాటా 71.93% నమోదైంది.

 

ఇప్పటిదాకా దేశంలో 30 కోట్లకు పైగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. అందులో పాజిటివిటీ శాతం 7.29%.

ప్రతి పది లక్షల జనాభాలో కేసులు జాతీయ సగటు కంటే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో తక్కువగా ఉన్నాయి. 

ప్రతి పది లక్షల జనాభాలో కేసులు జాతీయ సగటు కంటే 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయి. 

గత 24 గంటలలో 4,01,078 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో పది రాష్ట్రాలలోనే 70.77% కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో అత్యధికంగా 54,022 కేసులు, కర్నాటకలో 48,781, కేరళలో 38,460 కొత్త కేసులు వచ్చాయి.

 

దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య  37,23,446 కు చేరుకోగా ఇది ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో 17.01%.

 గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారు  78,282 మంది పెరిగారు. చికిత్సలో ఉన్నవారిలో 80.68% మంది పది రాష్ట్రాల్లోనే

ఉన్నారు.  

జాతీయ స్థాయిలో కోవిడ్ బాధితులలో మరణాల శాతం తగ్గుతూ 1.09% కి తగ్గింది. గత 24 గంటలలో 4,187 మంది కరోనాతో

మరణించారు.  అందులో 77.29% మంది పది రాష్ట్రాలకు చెందినవారే.  మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 898 మంది,

కర్నాటకలో 592 592 మంది చనిపోయారు.

 

గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మూడు ఉండగా అవి:

 డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలిఉ, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు  

 

****

 

 



(Release ID: 1717117) Visitor Counter : 171