రక్షణ మంత్రిత్వ శాఖ
అహ్మదాబాద్ పీఎం కొవిడ్ కేర్ ఆసుపత్రిలో సేవలు అందించేందుకు పశ్చిమ నౌకదళ స్థావరం నుంచి నౌకాదళ వైద్య బృందం కేటాయింపు
Posted On:
30 APR 2021 10:34AM by PIB Hyderabad
ప్రస్తుత కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు స్థానిక ప్రభుత్వాలకు సాయుధ దళాలు అందిస్తున్న సహకారంలో భాగంగా, నలుగురు వైద్యులు, ఏడుగురు నర్సులు, 26 మంది పారామెడికల్, 20 మంది సహాయక సిబ్బందితో కూడిన 57 మంది నౌకాదళ వైద్య బృందాన్ని అహ్మదాబాద్కు గురువారం కేటాయించారు. కొవిడ్ రోగులకు చికిత్సలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రి "పీఎం కేర్స్ కొవిడ్ హాస్పిటల్"లో వీరు సేవలు అందిస్తారు. ప్రస్తుతానికి, రెండు నెలలపాటు సేవలు అందించేందుకు వీరిని నియమించారు. అవసరమైతే ఈ వ్యవధిని పొడిగిస్తారు.
![](https://ci4.googleusercontent.com/proxy/_S0142wIJQ08wbFnzFmxcAS2UoAKlR6oAmY5wZN5W4KQxOeILVHqk9CHoExQXss9fKERYl9s19i8W40GA-CXrymtHN7dXwksZOSi880aQnrXXGdEFgOKBJwJpQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/navyPix1FMU4.jpg)
****
(Release ID: 1715000)
Visitor Counter : 224