ప్రధాన మంత్రి కార్యాలయం

నటుడు శ్రీ వివేక్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 17 APR 2021 4:32PM by PIB Hyderabad

నటుడు శ్రీ వివేక్ అకాల మరణం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ‘‘ప్రముఖ నటుడు శ్రీ వివేక్ గారి అకాల మరణం ఎందరినో దు:ఖం లో ముంచివేసింది.   ఆయన హాస్య చతురత, తెలివైన సంభాషణ లు ప్రజలకు వినోదాన్ని పంచిపెట్టాయి.  పర్యావరణం పట్ల, సమాజం పట్ల ఆయన కు ఉన్నటువంటి ఉద్వేగం ఆయన చలనచిత్రాలలోను, ఆయన జీవనం లోను ఉట్టిపడింది.  ఆయన కుటుంబానికి, స్నేహితులకు, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.

 

***



(Release ID: 1712427) Visitor Counter : 174