ప్రధాన మంత్రి కార్యాలయం

వైశాఖి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 13 APR 2021 9:05AM by PIB Hyderabad

పావన భరిత సందర్భం అయినటువంటి వైశాఖి నాడు, ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మంగళదాయకం అయినటువంటి ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరి జీవనం లో సంతోషాన్ని, సమృద్ధి ని అందించుగాక.  ప్రకృతి తోను, కష్టపడి పనిచేసే మన రైతుల తోను ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని ఈ పండుగ రోజు కలిగివుంది.  మన పొలాలు పైరుపచ్చ గా కళకళలాడుతూ ఉండుగాక; ఈ పర్వదినం మన గ్రహాన్ని సంరక్షించుకొనేందుకు మనను ప్రోత్సహించుగాక’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  

పవిత్రత నిండినటువంటి వైశాఖి సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.

***



(Release ID: 1711517) Visitor Counter : 104