ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 5.5 కోట్లు దాటిన కోవిడ్ టీకాలు గత 24 గంటల్లో 23 లక్షలకు పైగా టీకాలు


కొత్త కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, చత్తీస్ గఢ్, గుజరాత్

Posted On: 26 MAR 2021 11:35AM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ టీకాల కార్యక్రమం మరింత వేగం పుంజుకుంది. ఈ ఉదయం 7 గంటలకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు  9,01,887 శిబిరాల ద్వారా ఐదున్నర కోట్లకు పైగా  (5,55,04,440)  టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో  ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు 80,34,547, రెండో డోసులు  51,04,398. కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు   85,99,981, రెండో డోసులు 33,98,57, దీర్ఘకాల వ్యాధులతో 45 ఏళ్ళు పైబడ్డ వారి డోసులు  55,99,772 , 60 ఏళ్లు పైబడ్డవారి డోసులు 2,47,67,172 ఉన్నాయి. 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ మధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్లు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

80,34,547

51,04,398

85,99,981

33,98,570

55,99,772

2,47,67,172

5,55,04,440

 

దేశవ్యాప్తంగా వేసిన మొత్తం టీకాలలో 60% వాటా ఎనిమిది రాష్ట్రాలదే ఉంది. 

 

టీకాల కార్యక్రమం మొదలైన 69వ రోజైన మార్చి 25న  40,595  శిబిరాల ద్వారా 23 లక్షలకు పైగా (23,58,731)  టీకా డోసులివ్వగా అందులో 21,54,934 మంది లబ్ధిదారులు మొదటొ డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యధులు, 2,03,797 మంది రెండో డోస్ తీసుకున్న ఆరోగ్యసిబ్బంది, కోవిడ్ యోధులు ఉన్నారు. 

తేదీ: మార్చి 25, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ మధ్య  దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్లు పైబడ్డవారు

మొత్తం డోసులు

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

53,698

42,608

1,21,503

1,61,189

4,67,823

15,11,910

21,54,934

2,03,797

 

గత 24 గంటలలో ఇచ్చిన కోవిడ్ టీకా డోసులలో 10 రాష్టాల వాటా దాదాపు 70% ఉంది.

 

రోజువారీ కొత్త కోవిడ్ కేసులు ఐదు రాష్ట్రాలు- మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, చత్తీస్ గఢ్, గుజరాత్ లో ఎక్కువగా వస్తన్నాయి. గత 24 గంటలలో 59,118 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికసంఖ్యలో నమొదవటం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజులో అక్కడ 35,952 కేసులు రాగా ఆ తరువాత స్థానంలో ఉన్న పంజాబ్ లో 2,661, కర్నాటకలో  2,523 కేసులు వచ్చాయి.

ప్రత్యేకంగా ప్రస్తావించి చూపిన 10 రాష్ట్రాలలో రోజువారీ కేసుల పెరుగుదల నమోదవుతోంది.

 

ఫిబ్రవరి మధ్యలో అత్యంత దిగువకు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య మళ్లీ పెరుగుతూ చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య పెంచుతోంది. ప్రస్తుతం అది 4,21,066 కి చేరింది. దీనివల్ల గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా  25,874 పెరుగుదల నమోదు చేసుకుంది.  చికిత్సలో ఉన్నవారిలో 73.64% మంది కేవలం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ రాష్ట్రాలవారే ఉన్నారు. 

 

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,12,64,637  కు చేరింది. కోలుకున్నవారి శాతం 95.09%గా నమోదైంది. గత 24 గంటలలో 32,987 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటలలో 257 మంది కోవిడ్ వల్ల చనిపోయారు.  ఇందులో 78.6% మరణాలు ఆరు రాష్ట్రాల్లోనే సంభవించాయి.  అత్యధికంగా మహారాష్ట్రలో 111 మంది, పంజాబ్ లో 43 మంది చనిపోయారు.

పద్నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గత 24 గంటలలొ కోవిడ్ మరణం ఒక్కటి కూడా నమోదుకాలేదు.  అవి: రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, పుదుచ్చేరి, లక్షదీవులు, సిక్కిం, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, లద్దాఖ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్ 

***



(Release ID: 1707724) Visitor Counter : 185