ప్రధాన మంత్రి కార్యాలయం

నాలుగు దేశాల నాయకుల మొదటి దృశ్య సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభ వ్యాఖ్యలు

Posted On: 12 MAR 2021 8:39PM by PIB Hyderabad

గౌరవనీయులైన అధ్యక్షులు బైడెన్, ప్రధానమంత్రి మొర్రిసన్, ప్రధానమంత్రి సుగా, 

స్నేహితులను ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది.

అధ్యక్షుడు బైడెన్ చేసిన ఈ ప్రయత్నానికి, నా కృతజ్ఞతలు.

గౌరవనీయులారా, 

మన ప్రజాస్వామ్య విలువలతో, మనందరం ఐక్యంగా ఉన్నాము.  ఉదారమైన, బహిరంగ, సమగ్ర ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల మనం నిబద్ధత కలిగి ఉన్నాము. 

టీకాలు, వాతావరణ మార్పు,  అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వంటి ప్రాంతాలపై దృష్టి సారిస్తూ, మన నాలుగు దేశాల బృందాన్ని ప్రపంచ మంచి కోసం ఒక శక్తిగా రూపొందించడమే - ఈ రోజు మన సమావేశంలోని ప్రధానాంశం. 

ఈ సానుకూల దృక్ఫధమే, ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించే "వసుధైవ కుటుంబకం" యొక్క పురాతన తత్వశాస్త్రం యొక్క కొనసాగింపుగా నేను భావిస్తున్నాను. 

మన భాగస్వామ్య విలువలను పెంపొందించుకోడానికీ, సురక్షితమైన, స్థిరమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని ప్రోత్సహించడానికీ, మనం గతంలో కంటే కలిసికట్టుగా పనిచేద్దాం.

నేటి శిఖరాగ్ర సమావేశం ద్వారా మన నాలుగు దేశాల కూటమి కి మంచి సమయం వచ్చిందని భావిస్తున్నాను. 

ఇది ఇప్పుడు ఈ ప్రాంతంలో స్థిరత్వానికి ప్రధానమైన కేంద్రంగా నిలుస్తుంది. 

మీ అందరికీ ధన్యవాదములు. 

*****



(Release ID: 1704611) Visitor Counter : 169