ప్రధాన మంత్రి కార్యాలయం

మార్చి, 2వ తేదీన "మారిటైమ్ ఇండియా సదస్సు-2021" ని ప్రారంభించనున్న - ప్రధానమంత్రి

Posted On: 28 FEB 2021 6:01PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మార్చి, 2వ తేదీన "మారిటైమ్ ఇండియా సదస్సు-2021" ని దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.

"మారిటైమ్ ఇండియా సబస్సు-2021" గురించి :

కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్,  జలమార్గాల మంత్రిత్వ శాఖ, ఈ "మారిటైమ్ ఇండియా సదస్సు-2021" ని  www.maritimeindiasummit.in  అనే  వర్చువల్ వేదికపై 2021 మార్చి, 2వ తేదీ నుండి మార్చి, 4వ తేదీ వరకు నిర్వహించనుంది. 

వచ్చే దశాబ్దానికి భారతదేశ నావికా రంగానికి సంబంధించి, ఒక ప్రణాళిక రూపకల్పన కు ఈ సదస్సు దోహదపడనుంది.  అంతర్జాతీయ నావికా రంగంలో, భారతదేశాన్ని ముందంజలో ఉంచడానికి, ఈ సదస్సు, కృషి చేస్తుంది.  అనేక దేశాల నుండి ప్రముఖ వక్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.   మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు, డెన్మార్క్, భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తోంది. 

*****



(Release ID: 1701575) Visitor Counter : 119