ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో ఇప్పటిదాకా 1.34 కోట్ల కోవిడ్ టీకాలు

21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 1000 కి లోపే కోవిడ్ కేసులు

20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో మరణాలు సున్నా

Posted On: 26 FEB 2021 10:40AM by PIB Hyderabad

భారతదేశంలో ఇప్పటివరకు కోవిడ్ టీకాల సంఖ్య కోటీ 34 లక్షలు దాటింది. ఇందుకోసం ఇప్పటిదాకా 2,78,915 శిబిరాలు నిర్వహించారు.  ఇప్పటిదాకా వేసిన కోవిడ్ టీకాలలో  66,21,418 మంది ఆరోగ్య సిబ్బంది తీసుకున్న మొదటి డోస్,  20,32,994 మంది ఆరోగ్య సిబ్బంది తీసుకున్న రెండో డోస్,  48,18,231మంది కోవిడ్ యోధులు తీసుకున్న మొదటి డోస్ కలిసి ఉన్నాయి.  మొదటి డోస్ తీసుకుని 28 రోజులు పూర్తయిన ఆరోగ్య సిబ్బంది కోసం ఫిబ్రవరి 13న రెండో డోస్ ప్రారంభం కాగా అంతకుముందే ఫిబ్రవరి 2న కోవిడ్ యోధుల మొదటి డోస్ మొదలైంది.

క్రమ సంఖ్య

 

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

మొదటి డోస్

రెండో డోస్

మొత్తండోసులు

1

అండమాన్, నికోబార్ దీవులు

6,034

2,385

8,419

2

ఆంధ్రప్రదేశ్  

5,03,858

1,30,591

6,34,449

3

అరుణాచల్ ప్రదేశ్

24,193

6,331

30,524

4

అస్సాం

1,89,569

21,468

2,11,037

5

బీహార్

5,48,175

76,211

6,24,386

6

చండీగఢ్

18,894

1,568

20,462

7

చత్తీస్ గఢ్

3,73,644

48,347

4,21,991

8

దాద్రా, నాగర్ హవేలి

5,252

337

5,589

9

డామన్, డయ్యూ

2,151

254

2,405

10

ఢిల్లీ

3,62,072

34,567

3,96,639

11

గోవా

17,875

1,918

19,793

12

గుజరాత్

8,32,737

1,25,357

9,58,094

13

హర్యానా

2,20,672

68,361

2,89,033

14

హిమాచల్ ప్రదేశ్

1,00,723

17,041

1,17,764

15

జమ్మూ-కశ్మీర్

2,30,494

13,391

2,43,885

16

జార్ఖండ్

2,80,339

19,440

2,99,779

17

కర్నాటక

5,96,274

1,92,934

7,89,208

18

కేరళ

4,41,597

88,877

5,30,474

19

లద్దాఖ్

8,753

748

9,501

20

లక్షదీవులు

2,353

688

3,041

21

మధ్యప్రదేశ్

6,49,377

1,31,088

7,80,465

22

మహారాష్ట్ర

10,10,322

1,31,968

11,42,290

23

మణిపూర్

48,938

2,239

51,177

24

మేఘాలయ

28,860

1,350

30,210

25

మిజోరం

20,955

4,876

25,831

26

నాగాలాండ్

28,691

5,425

34,116

27

ఒడిశా

4,58,368

1,54,434

6,12,802

28

పుదుచ్చేరి

9,455

1,024

10,479

29

పంజాబ్

1,49,029

32,863

1,81,892

30

రాజస్థాన్

7,97,900

1,52,486

9,50,386

31

సిక్కిం

16,630

1,228

17,858

32

తమిళనాడు

3,78,411

50,844

4,29,255

33

తెలంగాణ

2,84,058

1,14,020

3,98,078

34

త్రిపుర

88,487

19,527

1,08,014

35

ఉత్తరప్రదేశ్

11,67,285

2,03,454

13,70,739

36

ఉత్తరాఖండ్

1,40,671

14,323

1,54,994

37

పశ్చిమ బెంగాల్

8,72,999

1,20,107

9,93,106

38

ఇతరములు

5,23,554

40,924

5,64,478

 

మొత్తం

1,14,39,649

20,32,994

1,34,72,643

 

టీకాలు మొదలైన 41వ రోజైన ఫిబ్రవరి 25న 8,01,480 టీకాలిచ్చారు. అందులో 3,84,834 మంది లబ్ధిదారులకు 14,600 శిబిరాల ద్వారా ఆరోగ్యసిబ్బందికి, కోవిడ్ యోధులకు మొదటి డోస్ ఇవ్వగా 4,16,646 మంది ఆరోగ్య సిబ్బందికి రెండో డోస్ ఇచ్చారు.  ఇప్పటిదాకా ఇచ్చిన 1,34,72,643 టీకా డోసులలో  మొదటి డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు 1,14,39,649 ఉండగా 20,32,994 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు.

9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 60% పైగా తీకాలు తీసుకోవటం పూర్తయింది. అవి: అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, లద్దాఖ్, చందీగఢ్, నాగాలాండ్, పంజాబ్, పుదుచ్చేరి.  

 

13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రిజిస్టర్ చేసుకున్న కోవిడ్ యోధులలో  40% కంటే తక్కువ మంది టీకాలు తీసుకున్నారు. అవి: చందీగఢ్, నాగాలాండ్, తెలంగాణ, మిజోరం, పంజాబ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, మణిపూర్, అస్సాం, అండమాన్-నికోబార్ దీవులు, మేఘాలయ, పుదుచ్చేరి 

భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 1,55,986 కి చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  కొన్ని రాష్టాలలో ఒక్క సారిగా కేసులు పెరగటమే  ఇందుకు కారణం. అయితే 21 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 1000 లోపే ఉంది. అవి:  జమ్మూకశ్మీర్ (820), ఆంధ్రప్రదేశ్ (611), ఒడిశా (609), గోవా (531), ఉత్తరాఖండ్ (491), బీహార్ (478), జార్ఖండ్ (467), చండీగఢ్ (279), హిమాచల్ ప్రదేశ్(244), పుదుచ్చేరి (196), లక్ష్జదీవులు (86), లద్దాఖ్ (56), సిక్కిం (43), మణిపూర్ (40), త్రిపుర (32), మిజోరం (27), మేఘాలయ (20), నాగాలాండ్ (13), డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి (5), రుణాచల్ ప్రదేశ్ (3) అండమాన్, నికోబార్ దీవులు (2).

 

 

గత 24 గంటలలో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూదా నమోదు కాలేదు.  అవి: ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, చందీగఢ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, లద్దాఖ్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, డయ్యూ-డామన్, దాద్రా-నాగర్ హవేలి, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, అందమాన్-నికోబార్ దీవులు

గత 24 గంటలలోచికిత్సలో ఉన్న కేసులలో మార్పును ఈ క్రింది పటంలో చూడవచ్చు. మహారాష్ట్రలో అత్యధికంగా ఎక్కువ మార్పు రావటాన్ని ప్రతిబింబిస్తూ  4,902 కేసులు పెరగటం కనిపిస్తుండగా కేరళలో అత్యంత ఋణాత్మక మార్పుతో 989 కేసులు తగ్గాయి.

 

 

 

భారతదేశంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,07,50,680 కి చేరింది.  కోలుకున్నవారి శాతం  is 97.17% అయింది. కోలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా పెరుగుతూ 10,594,694 కి చేరింది.  గత 24 గంటలలో  12,179 మంది కోలుకోగా వారిలో  85.34% మంది కేవలం ఆరు రాష్టాలకు చెందినవారే ఉన్నారు.  కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 4,652 మంది కోలుకోగా మహారాష్ట్రలో 3,744 మంది, తమిళనాడులో 947 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో 16,577 కొత్త కోవిడ్ కేసులు నిర్థారణ అయ్యాయి.  ఇందులో 86.18% కేవలం 6 రాష్ట్రాలకు చెందినవే కాగా  మహారాష్ట్రలో అత్యధికంగా 8702 కేసులు, ఆ తరువాత కేరళలో  3,677, పంజాబ్ లో 563 వచ్చాయి.  

 

గత 24 గంటలలో 120 మరణాలు నమోదయ్యాయి. అందులో   85.83% కేవలం ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 56 మంది చనిపోగా, కేరళలో 14 మంది, పంజాబ్ లో 13 మంది మరణించారు. 

***



(Release ID: 1701061) Visitor Counter : 200