ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ కేసులు పెరుగుతున్న మహారాష్ట, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, చత్తీస్ గఢ్

కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు బహుముఖీన ఉన్నతస్థాయి

కేంద్ర బృందాలు హుటాహుటిన పయనం
7 రాష్ట్రాలతో కాబినెట్ కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు
భారత్ లో 1.26 కోట్లు దాటిన మొత్తం కోవిడ్ టీకాలు

Posted On: 25 FEB 2021 12:12PM by PIB Hyderabad

భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కొవిడ్ కెసుల సంఖ్య 1,51,708 కాగా, ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  1.37%. నిజానికి ఈ పెరుగుదలకు కారణం మహారాష్ట, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, చత్తీస్ గఢ్ లలో అకస్మాత్తుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నకేసులే.  గత 24 గంటలలో 16,738 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో  89.57% కేవలం ఈ ఏడు రాష్ట్రాలలో నమోదైనవే కావటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 8,807 కొత్త కేసులు రాగా కేరళలో 4,106, పంజాబ్ లో 558 నమోదయ్యాయి.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015OT1.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002LAW2.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0033MS4.jpg

 

ఈ రాష్టాలు--- మహారాష్ట, కేరళ, కర్నాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్ లకు కేంద్ర ప్రభుత్వం బహుముఖీనమమైన అత్యున్నత స్థాయి బృందాలను హుటాహుటిన పంపింది. ఆయా రాష్టాలలో ఇలా అకస్మాత్తుగా కేసులు పెరగటానికి కారణాలను అధ్యయనం చేయటంతోబాటు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ కోవిడ్ ను నియంత్రించటం ఈ బృందాల లక్ష్యం.

వ్యాధి వ్యాపించకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది. ఈ రాష్టాలు కోవిడ్ వ్యాధి నిర్థారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాలని సూచించింది. నెగటివ్ యాంటిజెన్ పరీక్షఫలితాలు వెలువడిన సందర్భాలలో ఆర్ టి-పిసిఆర్ పరీక్షల వైపు తప్పనిసరిగా మొగ్గు చూపాలని కోరింది. పాజిటివ్ గా నిర్థారణ అయినవారిని వెంటనే ఐసొలేషన్ కు తరలించటం లేదా ఆస్పత్రులలో చేర్చటం, వాళ్ళద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నవాళ్లను గుర్తించటంలో చికిత్స అందించటంలో ఎక్కడా అలక్ష్యం తగదని కేంద్రం హెచ్చరించింది. జిల్లా అధికారులు క్రమం తప్పకుందా పురోగతిని తెలియజేయాలని ఆదేశించింది.

మరోవైపు దేశమంతటా మొత్తం పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. 2021 ఫిబ్రవరి 25 నాటికి పాజిటివ్ శాతం 5.17% గా నమొదైంది.

 

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004P3WJ.jpg

ఈ రోజు ఉదయం 7 గంటలకు 1,26,71,163 మందికి  2,64,315 శిబిరాల ద్వారా టీకాలు వేసినట్టయింది. ఇందులో  65,47,831 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ అందుకున్నవారు ఉండగా 16,16,348మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నారు.  45,06,984మంది కోవిడ్ యోధులు మొదటి డోస్ తీసుకున్నారు.   

రెండో డోస్ కోవిడ్ టీకాల కార్యక్రమం ఫిబ్రవరి 13న మొదలైంది. మొదటి డోస్ తీసుకొని 28 రోజులు పూర్తి చేసుకున్న వారు రెండో డోస్ కు అర్హులయ్యారు. మొదటి విడత కొవిడ్ యోధుల టీకాలు ఫిబ్రవరి 2న  మొదలైన సంగతి తెలిసిందే..

క్రమ సంఖ్య

 

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

మొదటి డోస్

 రెండో డోస్

మొత్తం డోసులు

1

అండమాన్-నికోబార్ దీవులు

5,644

2,118

7,762

2

ఆంధ్రప్రదేశ్

4,72,460

1,20,443

5,92,903

3

అరుణాచల్ ప్రదేశ్

22,433

5,497

27,930

4

అస్సాం

1,79,625

15,795

1,95,420

5

బీహార్

5,40,315

60,480

6,00,795

6

చండీగఢ్

17,256

1,306

18,562

7

చత్తీస్ గఢ్

3,66,493

39,390

4,05,883

8

దాద్రా, నాగర్ హవేలి

5,047

266

5,313

9

డామన్, డయ్యూ

1,858

254

2,112

10

ఢిల్లీ

3,48,669

29,025

3,77,694

11

గోవా

16,741

1,559

18,300

12

గుజరాత్

8,30,565

80,118

9,10,683

13

హర్యానా

2,16,422

55,075

2,71,497

14

హిమాచల్ ప్రదేశ్

98,881

12,818

1,11,699

15

జమ్మూ కశ్మీర్

2,17,910

10,285

2,28,195

16

జార్ఖండ్

2,72,164

17,708

2,89,872

17

కర్నాటక

5,86,545

1,79,124

7,65,669

18

కేరళ

4,22,669

70,600

4,93,269

19

లద్దాఖ్

8,199

748

8,947

20

లక్షదీవులు

2,344

639

2,983

21

మధ్యప్రదేశ్

6,46,766

77,584

7,24,350

22

మహారాష్ట్ర

9,81,359

1,05,752

10,87,111

23

మణిపూర్

46,042

2,190

48,232

24

మేఘాలయ

28,248

1,200

29,448

25

మిజోరం

19,643

4,031

23,674

26

నాగాలాండ్

27,195

5,141

32,336

27

ఒడిశా

4,50,361

1,34,587

5,84,948

28

పుదుచ్చేరి

9,436

1,023

10,459

29

పంజాబ్

1,39,305

27,388

1,66,693

30

రాజస్థాన్

7,83,652

1,47,570

9,31,222

31

సిక్కిం

15,875

1,056

16,931

32

తమిళనాడు

3,68,678

46,149

4,14,827

33

తెలంగాణ

2,83,387

1,06,583

3,89,970

34

త్రిపుర

86,336

16,416

1,02,752

35

ఉత్తరప్రదేశ్

11,40,754

86,021

12,26,775

36

ఉత్తరాఖండ్

1,39,169

11,833

1,51,002

37

పశ్చిమ బెంగాల్

7,87,013

99,478

8,86,491

38

ఇతరములు

4,69,356

39,098

5,08,454

 

మొత్తం

1,10,54,815

16,16,348

1,26,71,163

 

టీకాలు మొదలైన 40 వ రోజైన ఫిబ్రవరి 24న  5,03,947 టీకాలిచ్చారు. అందులో 2,87,032 మంది లబ్ధిదారులు (ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు) 9,959 శిబిరాల ద్వారా మొదటి డోస్  టీకాలు తీసుకోగా  2,16,915 మంది ఆరోగ్య సిబ్బమ్ది రెండో డోస్ టీకా తీసుకున్నారు.

మొత్తం 1,26,71,163 టీకా డోసులలో 1,10,54,815 డోసులు ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు మొదటి డోస్ తీసుకోగా  16,16,348 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ టీకా తీసుకున్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005SWV0.jpg

మొత్తం తీసుకున్న టీకా డోసులలో 56% వాటా ఎనిమిది రాష్టాలదే. అన్నిటిలోనూ ఆరేసి లక్షలకు పైగా టీకాలపంపిణీ జరిగింది. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 9.68% (12,26,775 డోసులు) ఇచ్చారు

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006PYR7.jpg

 

రెండో డోసు టీకాలలో  61% ఎనిమిది రాష్టాలలో తీసుకున్నారు. కర్నాటకలో అత్యధికంగా  రెండో డోస్ ఆరోగ్య సిబ్బందికి 11.08% (1,79,124)  డోసుల. టీకాలు వేశారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007EXU6.jpg

 

 

12 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 80% పైగా అర్హులైన ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు. అవి: లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్మ్ నాగాలాండ్, డామన్-డయ్యూ, అండమాన్-నికోబార్ దీవులు, లక్షదీవులు, కేరళ, గుజరాత్, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్, సిక్కిం

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008398N.jpg

 

 

రిజిస్టర్ చెసుకున్న కోవిడ్ యోధులలో 60% పైగా టీకాలు తీసుకున్నట్టు నమోదైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 10. అవి: డాద్రా-నాగర్ హవేలి, రాజస్థాన్, లక్షదీవులు, గుజరాత్, మధ్యప్రదేశ్మ్ త్రిపురమ్ ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్.   

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009N03B.jpg

భారతదేశంలొ ఇప్పటివరకు కోవిడ్ బారి నుంచి బైటపడినవారి సంఖ్య 1,07,38,501 కు చేరింది.  కోలుకున్నవారి శాతం  97.21% . కోలుకున్నవారికి, చికిత్సపొందుతూ ఉన్నవారికీ మధ్య తేడా పెరుగుతూ 1,05,86,793  కు చేరింది. గత 24 గంటలలో  11,799 మంది కోలుకున్నారు.

****

 



(Release ID: 1700784) Visitor Counter : 174