ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 2400 లాబ్ లలో ఇప్పటిదాకా 21.15 కోట్ల కోవిడ్ పరీక్షలు

దేశమంతటా మొత్తం కోటీ 11 లక్షల డోసులు టీకాల పంపిణీ
గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణమూ నమోదు కాని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

గత 24 గంటలలో కొత్త కోవిడ్ కేసులు నమోదు కాని 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు

Posted On: 22 FEB 2021 1:04PM by PIB Hyderabad

భారత దేశంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 21,15,51,746 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. గత 24 గంటలలో 6,20,216 పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్థారణ పరీక్షల కోసం లాబ్ ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతమున్న 2393 లాబ్ లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 1220 ఉండగా ప్రైవేట్ రంగంలో 1173 ఉన్నాయి. దీంతో రోజువారీ పరీక్షల సామర్థ్యం బాగా పెరిగింది. భారత్ లో ప్రస్తుతం పాజిటివ్ శాతం 5.20% గా నమోదైంది.

 

ప్రతి పది లక్షల జనాభాలో పరీక్షల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం 1,53,298.4 కి చేరింది.

 

2021 ఫిబ్రవరి 22 వతేదీ ఉదయం 8 గంటలకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 2,32,317 శిబిరాల ద్వారా  1,11,16,854 టీ కాలు ఇవ్వటం పూర్తయింది. ఇందులో 63,97,849 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ అందుకోగా  9,67,852 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్, 37,51,153 మంది కొవిడ్ యోధులు మొదటి డోస్ తీసుకున్నారు. మొదటి డోస్ తీసుకొని 28 రోజులు పూర్తయినవారికి రెండో డోస్ కోవిడ్ టీకాలివ్వటం ఫిబ్రవరి 13న మొదలైంది. కోవిడ్ యోధులకు టీకాలివ్వటం ఫిబ్రవరి 2న మొదలైంది.

 

క్రమ సంఖ్య

 

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

మొదటి డోస్

రెండో డోస్

మొత్తం డోసులు

1

అండమాన్, నికోబార్ దీవులు

4,846

1,306

6,152

2

ఆంధ్రప్రదేశ్

4,13,678

89,645

5,03,323

3

అరుణాచల్ ప్రదేశ్

19,702

4,041

23,743

4

ఆస్సాం

1,54,754

11,050

1,65,804

5

బీహార్

5,22,811

39,046

5,61,857

6

చండీగఢ్

12,953

795

13,748

7

చత్తీస్ గఢ్

3,41,251

20,699

3,61,950

8

దాద్రా, నాగర్ హవేలి

4,939

244

5,183

9

డామన్, డయ్యూ

1,735

213

1,948

10

ఢిల్లీ

2,94,081

17,329

3,11,410

11

గోవా

15,070

1,113

16,183

12

గుజరాత్

8,22,193

60,925

8,83,118

13

హర్యానా

2,08,308

23,987

2,32,295

14

హిమాచల్ ప్రదేశ్

95,105

12,092

1,07,197

15

జమ్మూ కశ్మీర్

2,00,695

6,731

2,07,426

16

జార్ఖండ్

2,54,531

11,484

2,66,015

17

కర్నాటక

5,41,332

1,14,043

6,55,375

18

కేరళ

3,99,284

38,829

4,38,113

19

లద్దాఖ్

5,827

600

6,427

20

లక్షదీవులు

1,809

115

1,924

21

మధ్యప్రదేశ్

6,40,805

3,778

6,44,583

22

మహారాష్ట్ర

8,78,829

47,637

9,26,466

23

మణిపూర్

40,215

1,711

41,926

24

మేఘాలయ

23,877

629

24,506

25

మిజోరం

14,627

2,241

16,868

26

నాగాలాండ్

21,526

3,909

25,435

27

ఒడిశా

4,38,127

94,966

5,33,093

28

పుదుచ్చేరి

9,251

853

10,104

29

పంజాబ్

1,22,527

14,269

1,36,796

30

రాజస్థాన్

7,82,701

38,358

8,21,059

31

సిక్కిం

11,865

700

12,565

32

తమిళనాడు

3,39,686

31,160

3,70,846

33

తెలంగాణ

2,80,973

87,159

3,68,132

34

త్రిపుర

82,369

11,587

93,956

35

ఉత్తరప్రదేశ్

10,66,290

85,752

11,52,042

36

ఉత్తరాఖండ్

1,31,384

7,166

1,38,550

37

పశ్చిమ బెంగాల్

6,39,252

49,912

6,89,164

38

ఇతరములు

3,09,794

31,778

3,41,572

                           మొత్తం

1,01,49,002

9,67,852

1,11,16,854

 

టీకాల కార్యక్రమం మొదలైన 37 వ రోజైన ఫిబ్రవరి 21న  31,681 టీకా డోసులు ఇచ్చారు. అందులో 24,471 మంది లబ్ధిదారులకు 1,429 శిబిరాల ద్వారా మొదటి డోసు ( ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు) ఇవ్వగా   7,210  మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నవారున్నారు.

మొత్తం 1,11,16,854 టీకా డోసులలో 1,01,49,002 డోసులు ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు ఇచ్చిన మొదటి డోస్ లు కాగా 9,67,852 డోసుకు ఆరోగ్య సిబ్బంది తీసుకున్న రెండో డోస్.  

 

 

ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకాలలో 60.17% కేవలం 7 రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యాయి. ఒక్క కర్నాటకలోనే 11.8% (1,14,043 డోసులు) ఇచ్చారు.

 

భారత్ లో ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య  1,06,99,410 కు చేరింది. కోలుకున్నవారి శాతం 97.22%గా నమోదైంది. చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 1,05,49,355 (71.3 రెట్లు) అధికం. 9,695 మంది గత 24 గంటలలో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా కోలుకున్నవారిలో 80.86% మంది కేవలం ఐదు రాష్ట్రాలకు చెందినవారే.  కేరళలో అత్యధికంగా ఒక రోజులో కోలుకున్నవారు 4,345 మంది ఉండగా మహారాష్ట్రలో 2,417 మంది, తమిళనాడులో 460 మంది నమోదయ్యారు.

 

 

దేసంలో ప్రస్తుతం కోవిడ్ చికిత్సపొందుతూ ఉన్న వారి సంఖ్య 1,50,055 కి చేరింది. ఇది భారతదేశపు మొత్తం పాజిటివ్ కేసులలో   1.36%. గత 24 గంటలలో   14,199 మందికి పాజిటివ్ గా నిర్థారణ జరిగింది. ఏడు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అవి: ఉత్తరాఖండ్, లద్దాఖ్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా-నాగర్ హవేలి, దామన్-డయ్యీ, అండమాన్-నికోబార్ దీవులు  

కొత్త కేసులలో 86.3% కేవలం ఐదురాష్టాల్లోనే నమోదయ్యాయి.   రోజువారీ అత్యధిక కేసులలో మహారాష్ట మొదటి స్థానంలో కొనసాగుతోంది. గత 24 గంటలలో మహారాష్ట్రలో 6,971 కేసులు రాగా, ఆ తరువాత స్థానంలో ఉన్న కేరళలో 4,070 కేసులు, తమిళనాడులో 452 కొత్తకేసులు వచ్చాయి.

 

 

గడిచిన 24 గంటలలో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: హర్యానా, ఆంధ్రప్రదేశ్మ్, జమ్మూ-కశ్మీర్, రాజస్థాన్, ఒడిశా, గోవా, చందీగఢ్, అస్సాం, మణిపూర్, సిక్కిం, లక్షదీవులు, త్రిపుర, నాగాలాండ్, లద్దాఖ్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, అందమాన్-నికోబార్ దీవులు  

గత 24 గంటలలో 83 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీటిలో 78.31% కేవలం ఐదు రాష్టాల్లోనే సంభవించాయి. మహారాష్ట్రలో గరిష్టంగా ఒక్క రోజులో 35 కోవిడ్ మరణాలు నమోదు కాగా కేరళలో 15 మంది చనిపోయారు. 

 

                                                                                                                                               

****



(Release ID: 1699924) Visitor Counter : 191