ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెరిగిన కరోనా కేసులు

ఇప్పటిదాకా 1.07 కోట్ల కోవిడ్ టీకా డోసులు

గత 24 గంటల్లో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ మరణాలు సున్నా

Posted On: 20 FEB 2021 12:27PM by PIB Hyderabad

భారతదేశంలో ఇప్పటిదాకా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులలో 1.30% మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు.  ప్రస్తుతం ఇంకా చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 1,43,127 కు చేరింది. కొన్ని రాష్టాలలో కొత్తగా పాజిటివ్ కేసులు రావటం పెరుగుతోంది. కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్ గఢ్ , మధ్యప్రదేశ్ రాష్టాలలో ఈ పెరుగుదల నమోదైంది. అన్నిటికంటే ఎక్కువగా కేరళలో నమోదవుతున్నాయి.  

 

గత వారం రోజుల్లో చత్తీస్ గఢ్ లో చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో 259 కొత్త కరోనా కేసులు వచ్చాయి. 

 

 

గతవారంలో మహారాష్ట్రలో కొత్త కేసుల పెరుగుదల స్పష్టంగా కనబడింది. ఈ రోజు దేశంలోనే అత్యధికంగా కొత్త కేసులు వచ్చిన రాష్ట్రంగా నిలిచింది.  . గత 24 గంటలలో  6,112 కొత్త కెసులు నమోదయ్యాయి.

 

మహారాష్ట్ర తరహాలోనే పంజాబ్ కూడా గత వారం రోజుల్లో అకస్మాత్తుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల చూపింది.  గడిచిన 24 గంటల్లో  383 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

2021 ఫిబ్రవరి 13 నుంచి మధ్యప్రదేశ్ లో కూడా కొత్త కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గత 24 గంటలలో 297 కొత్త కేసులు నమోదయ్యాయి.

అనేక రాష్టాలలో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, వ్యాధి వ్యాప్తిని సమర్థంగా నియంత్రించాలని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.  

అయితే, మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు, పరీక్షించటం, ఆనవాలు పట్టుకొవటం, చికిత్స అందించటం అనే వ్యూహాన్నే కొనసాగిస్తూ ఇప్పటివరకు 21 కోట్లకు పైగా (21,02,61,480) పరీక్షలు దేసవ్యాప్తంగా చేపట్టారు. జాతీయ స్థాయిలొ పాజిటివ్ శాతం గత 13 రోజులుగా  క్రమంగా తగ్గుతూనే వచ్చింది.  ప్రస్తుతం అది 5.22%గా నమోదైంది..           
 

 

ఇప్పటివరకు మొత్తం 2,22,313 శిబిరాల ద్వారా 1,07,15,204 మందికి తీకా డోసులు ఇచ్చినట్టు ఈ ఉదయం 8 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వీరిలో 63,28,479 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది ఉండగా  8,47,161 మంది రెండో డీఓస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, మంది మొదటి డోస్ అందుకున్న కోవిడ్ యోధులు ఉన్నారు.  

కోవిడ్ రెండో డోస్ టీకాల  కార్యక్రమం ఫిబ్రవరి 13న మొదలైంది. మొదటి డోస్  తీసుకొని 28 రోజులు పూర్తయినవారికి రెండో డోస్ ఇస్తున్నారు. కోవిడ్ యోధులకు టీకాలివ్వటం ఫిబ్రవరి 2న మొదలైంది.

 

 

క్రమసంఖ్య

 

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకాల లబ్ధిదారులు

మొదటి డోస్

రెండో డోస్

మొత్తం డోస్ లు

1

అండమాన్, నికోబార్ దీవులు

4,453

895

5,348

2

ఆంధ్రప్రదేశ్

3,98,108

71,707

4,69,815

3

అరుణాచల్ ప్రదేశ్

19,608

3,951

23,559

4

ఆస్సాం

1,47,368

10,164

1,57,532

5

బీహార్

5,15,363

35,070

5,50,433

6

చండీగఢ్

12,100

547

12,647

7

చత్తీస్ గఢ్

3,30,446

16,104

3,46,550

8

దాద్రా-నాగర్ హవేలి

4,801

169

4,970

9

డామన్-డయ్యూ

1,672

153

1,825

10

ఢిల్లీ

2,72,322

12,978

2,85,300

11

గోవా

14,386

634

15,020

12

గుజరాత్

8,19,060

37,597

8,56,657

13

హర్యానా

2,05,616

21,093

2,26,709

14

హిమాచల్ ప్రదేశ్

92,702

71,322

1,64,024

15

జమ్మూ-కశ్మీర్

1,89,840

5,282

1,95,122

16

జార్ఖండ్

2,46,213

10,522

2,56,735

17

కర్నాటక

5,29,968

99,452

6,29,420

18

కేరళ

3,92,993

32,060

4,25,053

19

లద్దాఖ్

5,005

358

5,363

20

లక్షదీవులు

1,809

115

1,924

21

మధ్యప్రదేశ్

6,26,391

0

6,26,391

22

మహారాష్ట్ర

8,31,921

28,465

8,60,386

23

మణిపూర్

38,585

1,434

40,019

24

మేఘాలయ

22,285

616

22,901

25

మిజోరం

14,428

2,206

16,634

26

నాగాలాండ్

20,603

3,419

24,022

27

ఒడిశా

4,33,584

68,129

5,01,713

28

పుదుచ్చేరి

8,481

645

9,126

29

పంజాబ్

1,20,015

9,455

1,29,470

30

రాజస్థాన్

7,80,665

19,054

7,99,719

31

సిక్కిం

11,102

698

11,800

32

తమిళనాడు

3,24,537

25,746

3,50,283

33

తెలంగాణ

2,80,277

86,051

3,66,328

34

త్రిపుర

81,042

11,134

92,176

35

ఉత్తరప్రదేశ్

10,66,290

85,752

11,52,042

36

ఉత్తరాఖండ్

1,29,221

6,231

1,35,452

37

పశ్చిమ బెంగాల్

6,09,987

40,989

6,50,976

38

ఇతరములు

2,64,796

26,964

2,91,760

                                         మొత్తం

98,68,043

8,47,161

1,07,15,204

 

టీకాల కార్యక్రమం మొదలైన 35వ రోజైన ఫిబ్రవరి20న ఉదయానికి 5,27,197 టీకా డోసులు ఇచ్చారు. అందులో . 2,90,935 మంది లబ్ధిదారులు 10,851 శిబిరాల ద్వారా మొదటి డోస్ టీకాలు అందుకున్నారు.   2,36,262 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నారు.  

9 రాష్ట్రాలలో 5 లక్షలకు పైగా డోసులు ఇచ్చారు. అవి ఉత్తరప్రదేశ్ (11,52,042), మహారాష్ట్ర (8,60,386), గుజరాత్ (8,56,657), రాజస్థాన్ (7,99,719), పశ్చిమబెంగాల్ (6,50,976), కర్నాటక (6,29,420), మధ్యప్రదేశ్ (6,26,391), బీహార్ (5,50,433) ఒడిశా (5,01,713).

 

ఇప్పటిదాకా 1,06,67,741 మంది కోవిడ్ బారినుంచి బైటపడ్దారు. గత 24 గంటలలో  10,307 మంది కోలుకున్నారు. దేసవ్యాప్తంగా కోలుకున్నవారి శాతం  97.27% కాగా ప్రపంచంలో అత్యధిక శాతాల్లో ఇది ఒకటి. కొత్తగా కోలుకున్నవారిలో  80.51% మంది కేవలం ఆరు రాష్టాల్లోనే ఉన్నారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో  4,854 మంది కోలుకోగా, మహారాష్ట్రలో 2,159 మంది, తమిళనాడులో  467 మంది కోలుకున్నారు.

కొత్తగా కోవిడ్ పాజిటివ్ నమోదైన వారిలో 86.69% మంది ఆరు రాష్టాలకు చెందినవారే. అత్యధిక కొత్త కేసులలో మహారాష్ట్ర తన మొదటి స్థానాన్ని కొనసాగిస్తోంది. అక్కడ 6,112 కేసులు నమోదు కాగా కేరళలో 4,505, తమిళనాడులో 448 కేసులు వచ్చాయి. కేవలం కేరళ, మహారాష్ట్రకు కలిసి 75.87%  చికిత్సలో ఉన్న కేసుల్లో వాటా ఉంది.

 

గత 24 గంటలలో 18 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలొ ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: తెలంగాణ, హర్యానా, జమ్మ-కశ్మీర్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, అస్సాం, చండీగఢ్, లక్షదీవులు, మణిపూర్, మేఘాలయ, లద్దాఖ్, మిజోరం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్-నికోబార్ దీవులు, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి.  

గత 24 గంటలలో 101 మరణాలు నమోదయ్యాయి. అందులో 78.22% కేవలం 5 రాష్ట్రాల్లో సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 44 మంది చనిపోగా కేరళలో 15, పంజాబ్ లో 8 మరణాలు నమోదయ్యాయి.

***



(Release ID: 1699619) Visitor Counter : 189