ప్రధాన మంత్రి కార్యాలయం

ఆంధ్ర ప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


Posted On: 14 FEB 2021 11:12AM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లా లో రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్‌ లో ఆంధ్ర ప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా దు:ఖదాయకం. ఈ విచారకర ఘడియ లో, తమ ప్రియతములను కోల్పోయిన వారి పట్ల నేను నా ఆవేదన ను వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వారు వీలయినంత త్వరలో కోలుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

 

 

 

 

****



(Release ID: 1697895) Visitor Counter : 160