ఆర్థిక మంత్రిత్వ శాఖ

వచ్చే ఐదేళ్లకు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కోసం రూ .50 వేల కోట్లుకేటాయించాలని ప్రతిపాదించారు

డిజిటల్ చెల్లింపు మార్గాలను ప్రోత్సహించడానికి ఈ పథకం కోసం 1,500కోట్ల రూపాయలు ప్రతిపాదించారు

ప్రధాన భారతీయ భాషలలో పాలన మరియు విధానానికి సంబంధించిన జ్ఞానం యొక్కభాండాగారాన్ని డిజిటలైజ్ చేయడానికి జాతీయ భాషా అనువాద ప్రచారం.

న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన పిఎస్‌ఎల్‌వి-సిఎస్ 51 చేతభారతీయ ఉపగ్రహాలతో బ్రెజిలియన్ అమెజోనియా ఉపగ్రహ ప్రయోగం; డిసెంబర్ 2021నాటికి గగన్యాన్ మిషన్ ను ప్రారంభించేందుకు ప్రణాళిక

ఐదేళ్లపాటు లోతైన మహాసముద్ర యాత్రకు రూ .4,000 కోట్లు

Posted On: 01 FEB 2021 1:41PM by PIB Hyderabad

నవకల్పన, పరిశోధన-అభివృద్ధి

         2019 జులై లో ప్రకటించిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విధివిధానాలు:

o   ఐదేళ్లకు గానురూ. 50,000 కోట్ల కేటాయింపు

o   మొత్తంగా జాతీయ ప్రాధాన్యతా రంగాలమీద దృష్టి సారించి పరిశోధన వాతావారణాన్ని బలోపేతం చేయటం

         డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించటానికి ప్రతిపాదించిన పథకానికి రూ. 1,500 కోట్లు  

         జాతీయ భాషా అనువాద మిషన్ ( ఎన్ టి ఎల్ ఎం) ద్వారా పాలనకు, విధానాలకు సంబంధిమ్చిన పరిజ్ఞానాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలలో లభ్యమయేట్టు చూడటం

         న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ( ఎన్ ఎస్ ఐ ఎల్ ) ప్రయోగించే పి ఎస్ ఎల్ వి – సి ఎస్ 51 ద్వారా బ్రెజిల్ వారి అమెజోనియా, ఉపగ్రహంతోబాటు మరికొన్ని భారతీయ ఉపగ్రహాల ప్రయోగం

         గగన్ యాన్ మిషన్ కార్యకలాపాల ద్వారా:

Ø  రష్యాలో అంతరిక్ష యానం మీద నలుగురు వ్యోమగాములకు శిక్షణ

Ø  2021 డిసెంబర్ నాటికి మానవరహిత ప్రయోగం

         సముద్ర అంతర్భాగంలో జీవ వైవిధ్యాన్ని శోధించి, పరిరక్షించటం కోసం సర్వే జరపటానికి వచ్చే ఐదేళ్ల కాలానికి రూ. 4,000 కోట్లు 

 

Innovation and R&D.jpg



(Release ID: 1694168) Visitor Counter : 209