ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా, ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి

Posted On: 24 JAN 2021 12:23PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఆ రాష్ట్ర ప్రజలకు సుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రధానమంత్రి, ఈ మేరకు, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  "ఉత్తర ప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజున,  రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.  ఉత్తమ త్యాగం, చిత్తశుద్ధి, సంప్రదాయం, సంస్కృతిలతో కూడిన పవిత్ర భూమిగా పేరు గాంచిన ఈ రాష్ట్రం, ఈ రోజున ఒక స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.  సర్వతోముఖాభివృద్ధి సాధించే విధంగా, ఈ రాష్ట్రం, నూతన శిఖరాలను చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను." అని పేర్కొన్నారు. 

 

*****



(Release ID: 1691880) Visitor Counter : 128