ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

9 లక్షల కన్సల్టేషన్లు పూర్తి చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ టెలిమెడిసిన్ సేవ ఈ-సంజీవని

ఈ సేవలు ప్రారంభించిన 2019 నవంబర్ నాటి నుండి ఏడాదిలో ఈ-సంజీవని ఏబి-హెచ్డబ్ల్యూసి 1,83,000 కన్సల్టేషన్లు పూర్తి చేసింది

ఈ-సంజీవనీ ఓపీడీ లో 7,16,000 పైగా కన్సల్టేషన్లు పూర్తి

Posted On: 02 DEC 2020 3:47PM by PIB Hyderabad

ఒక ప్రధాన మైలురాయి సాధనలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ టెలిమెడిసిన్ చొరవ ఈ-సంజీవనీ నేడు 9 లక్షల సంప్రదింపులను పూర్తి చేసింది. ఈ-సంజీవనీ, ఈ-సంజీవనీ ఓపిడి ప్లాట్‌ఫాంల ద్వారా అత్యధిక సంప్రదింపులు జరిపిన మొదటి పది రాష్ట్రాలు తమిళనాడు (2,90,770), ఉత్తర ప్రదేశ్ (2,44,211), కేరళ (60,401), మధ్యప్రదేశ్ (57,569), గుజరాత్ (52,571),  హిమాచల్ ప్రదేశ్ (48,187), ఆంధ్రప్రదేశ్ (37,681), ఉత్తరాఖండ్ (29,146), కర్ణాటక (26,906), మహారాష్ట్ర (10,903).

టెలిమెడిసిన్ అనేది ఇంటర్నెట్ ద్వారా రోగుల రిమోట్ నుండి రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం ఒక కొత్త పద్ధతి.  ఈ-సంజీవనీ రోగులు, వైద్యులు, వివిధ ప్రదేశాలలో నిపుణుల మధ్య వర్చువల్ సమావేశాలను, రియల్ టైంలో జరిగే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అనుమతిస్తుంది. ఈ రిమోట్ సంప్రదింపుల చివరలో,  ఈ-సంజీవనీ ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్‌ను అందిస్తుంది. దీనిని సోర్సింగ్ మందులకు ఉపయోగించవచ్చు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఔట్‌ పేషెంట్ సేవలను రిమోట్‌గా అందించడానికి వీలుగా 28 రాష్ట్రాలు ఆరోగ్య మంత్రిత్వ శాఖ  ఈ-సంజీవనీ చొరవను అందిపుచ్చుకున్నాయి. ఈ రాష్ట్రాలు టెలిమెడిసిన్ సేవలను దీర్ఘకాలికంగా ప్రారంభించడానికి ఉధృతంగా పనిచేస్తున్నాయి.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ-సంజీవని రెండు భిన్న పద్ధతులను ప్రారంభించింది - అవి డాక్టర్ టు డాక్టర్ (ఈ-సంజీవని ఎబి-హెచ్డబ్ల్యుసి) హబ్ మరియు స్పోక్ మోడల్, పేషెంట్ టు డాక్టర్ (ఈ-సంజీవని ఓపిడి). ఈ-సంజీవని ఆయుష్మాన్ భారత్-హెచ్‌డబ్ల్యుసిని రూపొందించి ఇప్పుడు ఒక సంవత్సరం అయ్యింది. నవంబర్ 2019 లో ఈ-సంజీవని ఎబి-హెచ్‌డబ్ల్యుసి సేవలను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అప్పటినుండి సుమారు 240 హబ్‌లు మరియు 5000 కి పైగా స్పోక్లు వివిధ రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. ఈ-సంజీవని ఈ-సంజీవని ఎబి-హెచ్డబ్ల్యుసి 1,83,000 సంప్రదింపులను పూర్తి చేసింది.

ఈ-సంజీవని ఓపిడి అనేది ప్రజలకు రిమోట్ గా ఆరోగ్య సేవలను పొందటానికి ఒక టెలిమెడిసిన్ వేరియంట్, ఇది 2020 ఏప్రిల్ 13 న దేశంలో మొట్టమొదటి లాక్డౌన్ సందర్భంగా రూపొందించబడింది. ఇప్పటివరకు, 7,16,000 కి పైగా సంప్రదింపులు ఈ-సంజీవని ఓపిడిలో నమోదు అయ్యాయి. ఇవి 240 కి పైగా ఆన్‌లైన్ ఓపీడీ లను హోస్ట్ చేస్తున్నాయి, ఇందులో సాధారణ ఓపీడీ లు, ప్రత్యేక ఓపీడీ లు ఉన్నాయి. ఈ-సంజీవని రెండు రకాలు ఉపయోగం, సామర్థ్యం మరియు కార్యాచరణ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

సి-డిఎసి మొహాలిలోని ఈ-సంజీవని బృందం రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోంది. సమాజంలోని అణగారిన వర్గాలకు కూడా ఈ-సంజీవని సేవలను విస్తరించడానికి వ్యూహాలను రూపొందించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో క్రమం తప్పకుండా సంప్రదిస్తోంది. తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ వంటి కొన్ని రాష్ట్రాలు ఐటియేతర అవగాహన ఉన్నవారికి మరియు ఇంటర్నెట్ సదుపాయం లేని పేద రోగులకు ఈ-సంజీవని సేవలను అందించడానికి వివిధ నమూనాలను ప్రయోగపూర్వకంగా అమలు చేయడం జరుగుతోంది.  

***



(Release ID: 1677843) Visitor Counter : 174