ఆర్థిక మంత్రిత్వ శాఖ

శ్రీలంక ఆర్థిక సదస్సు-2020 ప్రారంభోత్సవంలో ఆర్థిక మంత్రి కీల‌క‌ ఉపన్యాసం

प्रविष्टि तिथि: 01 DEC 2020 5:25PM by PIB Hyderabad

'శ్రీలంక ఎకనామిక్ సమ్మిట్ -2020' (ఎస్‌ఎల్ఈఎస్‌) 20వ ఎడిషన్ ప్రారంభ‌పు స‌మావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ‌, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఈ రోజు వర్చువల్  విధానంలో పాల్గొని ముఖ్య ఉపన్యాసం చేశారు.
ఆర్థిక, వ్యాపార సమస్యలపై చర్చించడానికి సిలోన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (సీసీసీ) ప్ర‌తి ఏటా ఎస్ఎల్ఈఎస్‌ను నిర్వ‌హిస్తోంది. సీసీసీ ఆర్థిక, వ్యాపార సమస్యలపై చర్చించే ప్ర‌ధాన వేదిక. “టేక్-ఆఫ్ కోసం రోడ్‌మ్యాప్: డ‌్రైవింగ్ ఎ పీపుల్‌-సెంట్రిక్ ఎకనామిక్ రివైవల్” అనే థీమ్‌తో ఈ సంవత్సరం ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు హెచ్‌.ఇ. గోతాబయ రాజపక్సే కార్య‌క్ర‌మం ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న
భార‌త ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ప్ర‌స్తుత మహమ్మారి సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి భారతదేశం తీసుకున్న చర్యలను ప్ర‌ధానంగా ఎత్తిచూపారు.
శ్రీలంక‌ తిరిగి పుంజుకోవ‌డానికి గాను కీలకమైన విధాన‌ప‌ర‌మైన అంశాల గురించి మంత్రి ప్ర‌సంగించారు. ఆర్థిక మంత్రి తన ముఖ్య ఉపన్యాసంలో భారతదేశం యొక్క 'ఆత్మనీర్భర్ భారత్ అభియాన్‌', 'సెల్ఫ్ రిలయంట్ శ్రీలంక' యొక్క దృష్టి సినర్జిస్టిక్, పరిపూరకరమైనవి కావచ్చు రెండు దేశాల ఆర్థిక పునరుజ్జీవన ప్రయత్నాలను మరింత సంఘటితం చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.
ఇరు దేశాల ప్రజల కేంద్రీకృత అభివృద్ధికి ఎంతో అవసరమయ్యేలా నిరంతర వృద్ధికి భారత దేశం,శ్రీలంక మధ్య సహకారం ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి హైలైట్ చేశారు. శ్రీలంకతో అభివృద్ధి సహకార సంబంధాలలో భారత్ బలమైన భాగస్వామిగా ఉందని, పరస్పర ప్రయోజనాల కోసం అర్ధవంతమైన ఆర్థిక సహకారాన్ని కొనసాగించడానికి త‌మ‌ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్న‌ట్టుగా ఆర్థిక మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. పరిశ్రమ మరియు ప్రైవేటు రంగానికి నియంత్రణ స్థిరత్వం మరియు విధాన నిశ్చయత యొక్క ప్రాముఖ్యతను కూడా ఆమె ఎత్తి చూపారు.

                               

****


(रिलीज़ आईडी: 1677559) आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Tamil