ప్రధాన మంత్రి కార్యాలయం

మౌలానా శ్రీ క‌ల్బే సాదిక్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 NOV 2020 2:22PM by PIB Hyderabad

ఆల్ ఇండియా ముస్లిమ్ ప‌ర్స‌న‌ల్ లా బోర్డు ఉపాధ్య‌క్షుడు మౌలానా శ్రీ క‌ల్బే సాదిక్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ దిగ్భ్రాంతి ని వ్య‌క్తం చేశారు.

‘‘ఆల్ ఇండియా ముస్లిమ్ ప‌ర్స‌న‌ల్ లా బోర్డు ఉపాధ్య‌క్షునిగా వ్య‌వ‌హ‌రించిన మౌలానా క‌ల్బే సాదిక్ గారి మ‌ర‌ణ‌ వార్త ను గురించి తెలుసుకొని అత్యంత దుఃఖితుడిని అయ్యాను.  సామాజిక స‌ద్భావం కోసం, సోద‌రభావం కోసం ఆయ‌న ఎంతగానో పాటుపడ్డారు.  ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, ఆయ‌న ప్ర‌శంస‌కుల‌కు క‌లిగిన శోకంలో నేను సైతం పాలుపంచుకొంటున్నాను’’ అని ట్విట‌ర్ లో న‌మోదు చేసిన ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

****



(Release ID: 1675592) Visitor Counter : 93