సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎంఎస్ఎంఈలు / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కొత్త ఆన్‌లైన్ వ్యవస్థ టైమ్ & టెక్నాలజీ ప్రకారం ఉంటుంది.

పూర్తిగా నిరంతరాయ, సాఫీగా ఉండే వ్యవస్థ కాబట్టి స్థిరత్వం , స్థితిస్థాపకతను సాధ్యమవుతుంది.

2020 జూలై 1 న ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికే 11 లక్షలకు పైగా ఎంఎస్ఎంఇలు నమోదయ్యాయి.

ఇందులో పాన్ నంబర్‌తో 9.26 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

వీటిలో 1.80 లక్షలకు పైగా పాత యూఏఎం హోల్డర్లు ఉన్నారు; 1.73 లక్షల సంస్థలు మహిళల యాజమాన్యంలో ఉన్నాయి.

ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పెంచడానికి ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది

పాన్ , జిఎస్టి లేకుండా రిజిస్ట్రేషన్కు 31.3.2021 వరకు ప్రత్యామ్నాయ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Posted On: 07 NOV 2020 10:30AM by PIB Hyderabad

కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ  ప్రారంభించిన ఎంఎస్ఎంఈ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్  కొత్త ఆన్‌లైన్ వ్యవస్థ ఈ ఏడాది జూలై నుంచి అమలవుతోంది.  ఇది కాలం, సాంకేతిక పరీక్షలకు అనుగుణంగా ఉంటుంది. ఇప్పటికే 11 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ లు విజయవంతంగా స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నాయి.

ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ ల  నిర్వచనం , నమోదు ప్రక్రియను సవరించిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 1 జూలై, 2020న మొదలయింది. ఎంఎస్ఎంఈ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ (https://udyamregistration.gov.in) కోసం కొత్త పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. అప్పటి నుండి  పోర్టల్ సక్రమంగా పనిచేస్తోంది. ఈ పోర్టల్ను సీబీడీటీ , జీఎస్టీ నెట్‌వర్క్‌లతో పాటు జిఎమ్‌తో అనుసంధానం చేశారు.  ఫలితంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా కాగిత రహితంగా పూర్తవుతుంది.

ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం వ్యవస్థాపకులకు పూర్తి సహకారాన్ని అందించాలని మంత్రిత్వ శాఖ తన క్షేత్రస్థాయి సంస్థలు.. ఎంఎస్ఎంఇ-డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్, ఎంఎస్ఎంఇ టెక్నాలజీ సెంటర్స్, ఎన్ఎస్ఐసి, కెవిఐసి, కాయిర్ బోర్డు వంటి వాటికి సూచించింది.  అన్ని జిల్లా న్యాయాధికారులు , జిల్లా పరిశ్రమల కేంద్రాలు ఎంఎస్ఎంఇల ద్వారా నమోదును వేగవంతం చేయాలని కోరింది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఎంఎస్ఎంఇల ఇబ్బందులను దాని సెంట్రల్ కంట్రోల్ రూమ్ నెట్‌వర్క్ , దేశవ్యాప్తంగా 68 స్టేట్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా ఛాంపియన్స్ ప్లాట్‌ఫాం పరిష్కరిస్తోంది.

అక్టోబర్ 31, 2020 వరకు (10 లక్షలకు పైగా) రిజిస్ట్రేషన్ల విశ్లేషణ ప్రకారం, ధోరణి , స్థూల పరిస్థితి ఇలా ఉంది: -

 3.72 లక్షల సంస్థలు ఉత్పత్తి విభాగంలో నమోదు కాగా, సేవా రంగంలో 6.31 లక్షల సంస్థలు నమోదయ్యాయి.

సూక్ష్మ సంస్థల వాటా 93.17% కాగా, చిన్న , మధ్యతరహా పరిశ్రమలు వరుసగా 5.62% , 1.21% నమోదయ్యాయి.

98 7.98 లక్షల సంస్థలు మగవారికి చెందినవి కాగా, 1.73 లక్షల సంస్థలు మహిళా పారిశ్రామికవేత్తలవి.

11,188 సంస్థలను దివ్యాంగులు నిర్వహిస్తున్నారు

రిజిస్ట్రేషన్లలో టాప్ 5 పారిశ్రామిక రంగాలు - ఆహార ఉత్పత్తులు, జౌళి, దుస్తులు, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు , యంత్రాలు & పరికరాలు.

ఈ రిజిస్టర్డ్ యూనిట్ల ద్వారా 1,01,03,512 మందికి ఉపాధి లభించింది.

 ఉద్యమ్ రిజిస్ట్రేషన్లో మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ , గుజరాత్ ముందున్నాయి.

 పాన్ లేకుండా నమోదు 31.03.2021 వరకు ప్రత్యామ్నాయ ఏర్పాటుగా అనుమతిస్తారు.

ఇదే విధానంలో  31.03.2021 వరకు జీఎస్టీ సంఖ్య లేకుండా కూడా రిజిస్ట్రేషన్ను కూడా అనుమతిస్తారు.

ఇంకా నమోదు కాని సంస్థలు, ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ , ఇతర ప్రభుత్వ సంస్థల ప్రయోజనాలను పొందటానికి స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఉచితం , .gov.in చూపించే ప్రభుత్వ పోర్టల్‌లో మాత్రమే చేయాలి.

నకిలీ , తప్పుదోవ పట్టించే ఏజెన్సీలు , వెబ్‌సైట్లు / పోర్టల్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని వ్యవస్థాపకులకు మంత్రిత్వశాఖ సూచించింది. ఏదైనా సహాయం కోసం, పరిశ్రమల యజమానులు సమీపంలోని డిఐసిలను లేదా మంత్రిత్వ శాఖ  చాంపియన్స్ కంట్రోల్ రూమ్‌లను సంప్రదించవచ్చు లేదా మా పోర్టల్ https://champions.gov.in ద్వారా ఫిర్యాదు పంపించవచ్చు.

***



(Release ID: 1670938) Visitor Counter : 230