రక్షణ మంత్రిత్వ శాఖ
సైనిక పాఠశాలల్లోకి ప్రవేశాలు (2021-22 విద్యా సంవత్సరం)
Posted On:
07 NOV 2020 8:59AM by PIB Hyderabad
సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిది తరగతుల్లోకి ప్రవేశాల కోసం, అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష-2021 (ఏఐఎస్ఎస్ఈఈ)ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన (ఆదివారం) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లోకి ఏఐఎస్ఎస్ఈఈ ద్వారా ప్రవేశాలు ఉంటాయి. గత నెల 20వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 19వ తేదీతో ముగుస్తుంది. https://aissee.nta.nic.inలో వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థులు దరఖాస్తును పంపాలి. ఎన్టీఏ వెబ్సైట్ www.nta.ac.inలోనూ సమగ్ర వివరాలను చూడవచ్చు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరీ కింద కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 33 సైనిక పాఠశాలల్లో ఆరవ తరగతిలోకి బాలికలకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు.
***
(Release ID: 1670935)
Visitor Counter : 165
Read this release in:
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati